వరంగల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం గడువు ఇచ్చిన వానలు మళ్లీ దంచికొడుతున్నా యి. ఆదివారం సాయంత్రం మొదలైన వాన తెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మూడు మండలాలు మినహా జిల్లా వ్యా ప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రోజంతా జిల్లాలో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. వారం క్రితం భారీ వర్షాలతో వచ్చిన వరదలు తీవ్రనష్టం కల్గించాయి. ఇప్పు డు మళ్లీ వానలు పడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వరదలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్తోపా టు మండలాలు, గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయి. వారం క్రితం వరకు పడిన వానలతో దెబ్బతిన్న రోడ్లను రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ఇప్పుడే మరమ్మతు చేస్తున్నా యి. ఇదే సమయంలో మళ్లీ అధిక వర్షా లు కురుస్తుండడం పనులకు ఇబ్బంది కరంగా మారుతోంది. ఈ పనులకు తా జా వర్షాలతో అంతరాయం కలుగుతోం ది. మరోవైపు అధిక వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి రైతుల కు ఈసారి వానలు బాగా నష్టం చేస్తున్నాయి. కాత దశకు వస్తున్న ఈ తరుణంలో అధిక వర్షాలు బాగా నష్టం చేస్తున్నాయని వాపోతున్నారు. మక్కజొన్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. వానకా లం ఆరంభంలో వేసిన మక్కజొన్న పం ట చేతికి వస్తోంది. ఇప్పుడే అధిక వాన లు పడుతుండడంతో కంకులు చేనుపైనే తడిసి మొలకలు వచ్చే పరిస్థితి ఉంటోం ది. తేమ వాతావరణం ఉండడంతో పంటలకు ప్రతికూలంగా మారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కువ ప్రాంతాల్లో…
మూడు మండలాలు మినహా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. వా రం క్రితం అత్యధిక వర్షపాతం నమోదైన నడికూడ, శాయంపేట, కమలాపూ ర్ మండలాల్లో ఈసారి ఓ మోస్తరుగానే కురుస్తున్నాయి. కాజీపేట మండలంలో ఈసారీ అత్యధిక వర్షపాతం నమోదైం ది. ఆదివారం రాత్రి నుంచి సోమవా రం మధ్యాహ్నం వరకు ఏకంగా 84.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 2394 రెట్లు ఎక్కువ. ధర్మసాగర్ మండలంలో సా ధారణం కంటే 2007 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. హసన్పర్తిలో 1171 శాతం, వేలేరులో 1595 శాతం, దామెరలో 1296 శాతం ఎక్కువ వాన లు పడ్డాయి. వరుసగా కురుస్తున్న జో రు వానలతో వరద పెరిగి పలు ప్రాంతా ల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. గ్రా మాల్లోనూ చెరువుల కింద పొలాలు పూర్తిగా జలమయ్యాయి.