కాశీబుగ్గ అక్టోబర్12: రూ. 10 కోట్లతో మిర్చి ఖరీదు వ్యాపారి పరారయ్యాడని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం అడ్తి వ్యాపారులతోపాటు వివిధ కార్మికులు ధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రెండు గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. చాంబర్ అధ్యక్ష కార్యదర్శి బొమ్మినేని రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, అడ్తి వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీకి సంబం ధించిన మిర్చి వ్యాపారులు బిల్లా నాగేందర్, యుగేంధర్ పదేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. మిర్చిని అడ్తిదారుల ద్వారా కొను గోలు చేసి 15 రోజుల నుంచి నెలలోపు డబ్బులు చెల్లించాలి. 6 నెలల నుంచి అడ్తిదారులకు ఇవ్వాల్సిన సుమారు రూ.10కోట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన డబ్బులు చెల్లి స్తామని ఫోనులో తెలిపి, స్విచ్ఛాఫ్ చేశారు. ఐదు రోజులుగా ఇంటికి తాళం వేసి పరారీలో ఉండడంతో సుమారు 50 మంది అడ్తి వ్యా పారులు ఆర్థికంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మార్కెటింగ్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదన్నారు. దీంతో చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేష్ రాహుల్, డీఎంవో ప్రసాదరావు వ్యాపారులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయి సమస్యల పరిష్కరిస్తామని తెలిపారు. వెంటనే క్రయవిక్ర యాలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీపీ, కలెక్టర్ హామీ ఇచ్చారని అధికారులు తెలపడంతో ఆందోళన విరమించి యథావిధిగా కాంటాలు నిర్వ హించారు. కార్యక్రమంలో చాంబర్ ఉపాధ్యక్షులు మొగిలి చంద్ర మౌళి, సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, కటకం పెంటయ్య, ఎన్రెడ్డి లింగారెడ్డి, కంచ సంపత్, రాజేశ్, లోలకపురి సురేందర్, చింతల పల్లి వీరారావు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.