నేడు వసతుల కల్పనపై పరిశీలించనున్న మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి, సత్యవతి
వరంగల్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. శాశ్వత, తా త్కాలిక ప్రాతిపదికన వసతుల కల్పనకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే పెద్ద పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ కాకతీయుల కట్టడాన్ని చూ సేందుకు పర్యాటకులు వేలాదిగా తరలివస్తుండగా, యునెస్కో గుర్తింపు తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. కరోనా సమయంలోనూ ఆదివారాల్లో ఏకంగా 10వేలమంది వరకు వస్తుండగా, మిగ తా రోజుల్లో సగటున రెండు వేల మంది వరకు సందర్శిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రణాళిక రూపొందించే ప్రక్రియలో భాగంగా పర్యాటక మం త్రి వి.శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం పాలంపేటకు రానున్నారు. రామ ప్ప, అక్కడి పరిసరాలను పరిశీలించనున్నారు. ఆల యం నుంచి దాదాపు 20 ఎకరాల స్థలం కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోనే ఉండగా ఆలయం చుట్టూ 800 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందు కు అనుమతి ఉండదు. చారిత్రక నిర్మాణానికి ఇబ్బంది గా పరిణమించేలా కొత్తగా నిర్మించినా వాటిని తొలగించే అవకాశం ఉన్న క్రమంలో యునెస్కో నిబంధన లు కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుంది. ఈ క్రమం లో పురావస్తు శాఖ పరిధిలోని రామప్ప స్థలానికి వెలుపలి ప్రాంతంలో పర్యాటకుల వసతుల కల్పన కోసం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఐలాండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు
రామప్ప అభివృద్ధిలో భాగంగా చెరువు మధ్యలో విశాలంగా ఉన్న భూభాగాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. లక్నవరం తరహాలో ఐలాండ్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రస్తు తం పర్యాటకుల కోసం 20 గదులతో ఒక రిసార్ట్ ఉన్నప్పటికీ రద్దీకి సరిపోవడం లేదు. ఈమేరకు మరిన్ని గదులతో హరిత హోటల్, కాటేజీలు నిర్మించాలని భావిస్తోం ది. రామప్పకు పురావస్తుశాఖ గుర్తింపు నేపథ్యంలో ఈ ప్ర తిపాదనను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. రా మప్పకు వెళ్లే రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వంటి వాటితో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే చాలావరకు పనులను పూర్తిచేసింది. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా మరికొన్ని పనులను చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
కీలక ప్రాంతం కేంద్రం పరిధిలోనే..
రామప్ప ఆలయం, దాని చుట్టు ఉన్న ప్రదేశాలు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయి. కీలకమైన ఈ ప్రాంతంలో ఏ చిన్న పనులు చేయాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతుల సంగతి ఎలా ఉన్నా రామప్ప వద్ద ముఖ్యమైన పనులను సైతం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆలయ ఆవరణలోని కామేశ్వర ఆలయం శిథిలావస్థకు చేరడంతో దీన్ని పునరుద్ధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునరుద్ధరణ కోసం 2011లో కామేశ్వర ఆలయాన్ని విప్పి పెట్టారు. 2013లో రామప్ప ఆలయం ఎనిమిది శతాబ్దాల ఉత్సవాలు జరిగాయి. అప్పటికే దీన్ని పూర్తి చేయాలని అనుకున్నా పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. వర్షాల వల్ల 2017 ఆగస్టులో రామప్ప ఆలయం తూర్పు వైపు ప్రహరీ 40 మీటర్ల పొడవు మేరకు కూలింది. దీన్ని పునర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభు త్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నిసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టు జోక్యంతో కేంద్ర పురావస్తు శాఖ స్పందించి మరమ్మతు పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2018 జనవరిలో రూ.1.15 కోట్ల నిధులను మంజూ రు చేసింది. ప్రహరీ పునరుద్ధణ పనులతో పాటు చారిత్ర కట్టడం రామప్ప ఆవరణలో పలు అభివృద్ధి పనులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరిం ది. రామప్ప ఆవరణలోని గార్డెన్లో అంతర్గత రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35 లక్షలను మంజూరు చేసినా పనులు పూర్తి కాలేదు. రామప్ప ఆలయ ఆవరణలో అండర్గ్రౌండ్లో వ్యవస్థతో కరంటు సరఫరా వ్యవస్థ నిర్మాణం కోసం రూ.18 లక్షలు కేటాయించారు. కేంద్ర పురావస్తు శాఖ ఇప్పటికీ ఈ పనులను మొదలు పెట్టలేదు. యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా అయినా కేంద్ర ం ఈ పనులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.