వరంగల్ రూరల్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలోని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకల (దుస్తువులు)ను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 1500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
అన్ని పండుగలను రాష్ట్ర ప్రభుత్వం సమానంగా చూస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎండబ్య్లూవో ఎండీ యాకూబ్, నర్సంపేట ఆర్డీవో, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి