నర్సంపేట, సెప్టెంబర్ 24: రైతులకు నష్టం కలిగించే చట్టాలను తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం గద్దె దిగాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేశ్ డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన భారత్బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో శుక్రవారం బైక్ ర్యాలీని భారత మార్క్సిస్టు, కమ్యూనిస్టు పార్టీ ఐక్య, అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించిన మూడు చట్టాలు, నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుసుంభ బాబురావు, నాగెల్లి కొమురయ్య, సింగతి మల్లికార్జున్, పావురాల సీతారాములు, బత్తిని కుమారస్వామి, మాతంగి బాబురావు, వెండి రాజు, కే రంజాన్, ఎన్ భాస్కర్ పాల్గొన్నారు.
చట్టాలను రద్దు చేయాలి
ఖానాపురం: ఈ నెల 27న భారత్బంద్ను విజయవంతం చేయాలని ఏఐఎఫ్డీవై డివిజన్ బాధ్యుడు ఒంటేరు రాజు పిలుపునిచ్చారు. కార్మిక, కర్షకులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వేల్పుల రాకేశ్, రవికుమార్, వెండి రాజు, అనిల్బాబు పాల్గొన్నారు.
నల్లబెల్లి: కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈ నెల 27న చేపట్టిన భారత్బంద్ను విజయవంతం చేయాలని ఎంసీపీఐ(యూ) మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య అన్నారు. మండలకేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మిక, కర్షకులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఐఎఫ్డీఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు, సుధ, కవిత, అనిల్, భాస్కర్, వెంకటేశ్, సుజాత, కళమ్మ, రజిత పాల్గొన్నారు.
కాశీబుగ్గ: కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న జరిగే భారత్బంద్ను జయప్రదం చేయాలని ఏఐసీటీయూసీ రాష్ట్ర నాయకుడు పనాస ప్రసాద్ పిలుపునిచ్చారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుంచు జగదీశ్వర్, రాయినేని ఐలయ్య, నరహరి పాల్గొన్నారు.
రాయపర్తి: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన భారత్బంద్ను మండలంలోని అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని ఎంసీపీఐ(యూ) మండల నాయకుడు గుగులోత్ అరుణ్నాయక్ కోరారు. సన్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు కవిత, వెంకన్న, యాకయ్య, ఎల్లయ్య, గుగులోత్ రమేశ్, భూక్యా బాలు పాల్గొన్నారు.