నర్సంపేట, సెప్టెంబర్ 26 : మోదీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలని ఏఐకేఎస్ సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్ అన్నారు. ఆదివారం నర్సంపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని కేంద్రంలోని మోదీ ప్రభుత్వ మతోన్మాద, రైతు వ్యతిరేక కార్యక్రమాలను తిప్పికొట్టి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు పెండెం రామానంద్, వేముల సాంబయ్యగౌడ్, మోడెం మల్లేశం, కన్నం వెంకన్న, డేగల శ్రీనివాస్, జక్కు ల తిరుపతి, షేక్జావేద్, కల్లేపల్లి ప్రణయదీప్, జనగం కుమారస్వామి, నాగెల్లి కొమురయ్య, ఎలకంటి విజయ్కుమార్, రాజేందర్, భోగి సారంగపాణి, మాసాని రమేశ్, శ్రీరామోజు మురళి, తుమ్మలపల్లి సందీప్, ముల్కల సాం బయ్య, ఓర్సు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి అన్నారు. మండలంలోని మనుగొండ, మచ్చాపురం, కొ మ్మాల, ఎలుకుర్తి గ్రామాల్లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు మంద రవి, మల్లికార్జున్, కందికొండ కుమారస్వామి, రవీందర్రెడ్డి, సాయిరాం, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవా రం నిర్వహించ తలపెట్టిన భారత్బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రజలను కోరారు. ఆదివారం 27వ డివిజన్ దయానంద్ కాలనీలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని ధారాదత్తం చేయడానికి చేస్తున్న కుట్రలను భగ్నం చేయాలన్నారు.