నర్సంపేట/ఖానాపురం/కాశీబుగ్గ/గీసుగొండ/నల్లబెల్లి/మట్టెవాడ, సెప్టెంబర్ 28: భగత్సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ, ఎంసీపీఐయూ డివిజన్ కార్యదర్శి కన్నం వెంకన్న పిలుపునిచ్చారు. ఏఐఎఫ్డీడబ్ల్యూ, ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం భగత్సింగ్ 114వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో నాగెల్లి కొమురయ్య, సురేశ్, భారతి, సంపూర్ణ, జయమ్మ, బిందు, రాకేశ్, అంజలి, సాగర్, సాంబలక్ష్మి, భాగ్య పాల్గొన్నారు. ఖానాపురం మండలం ధర్మరావుపేటలో భగత్ యూత్ ఆధ్వర్యంలో భగత్సింగ్ జయంతి నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు కరుణాకర్రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెన్ను పూర్ణచందర్, పోతరాజు కరుణాకర్, రమేశ్, వెంకటేశ్వర్రావు, యాకస్వామి, దేవేందర్రావు, కృష్ణ, ప్రభాకర్, వెంకన్న పాల్గొన్నారు. కాశీబుగ్గలో భగత్సింగ్ జయంతిని జంగం రజిత ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ హాజరై భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆకోజు జగన్నాథచారి, రేగూరి నాగరాజు, జూలూరి నాగరాజు, బచ్చన్సింగ్ పాల్గొన్నారు. గీసుగొండ మండలం రెడ్డిపాలెంలో భగత్సింగ్ చిత్రపటానికి ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కుమారస్వామి పూలమాల వేశారు. కనకం సంధ్య, శిరీష, మల్లికార్జున్, తింగన్న, కొమురమ్మ, రాజు, ముత్తయ్య, నాగరాజు పాల్గొన్నారు. ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్లబెల్లిలోని అంబేద్కర్ సెంటర్లో భగత్సింగ్తోపాటు గుర్రం జాషువా చాత్రపటాలకు జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి భట్టు సాంబయ్య, రవి, రాకేశ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేట, ఎల్లమ్మబజార్, చార్బౌళిలో భగత్సింగ్ జయంతి నిర్వహించారు.