శాయంపేట, ఆగస్టు 2 : చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన ఆయా వర్గాల్లో ఆనందాన్ని నింపుతోంది. రైతు బీమా తరహాలోనే చేనేత వర్గాలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేనేత పరిశ్రమల్లో రోజంతా రెక్కల కష్టంతో సంపాదించుకుని కడుపునింపుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉ న్నాయి. చేనేత పరిశ్రమలో ఎక్కువగా మ ధ్య వయస్సు నుంచి వృద్ధులు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ సర్కారు చేనేత రంగానికి జవసత్వాలు నింపుతున్నది. రాష్ట్ర బడ్జెట్లో నూ ప్రత్యేక నిధులను కేటాయించి ఊతమిస్తున్నది. రూరల్ జిల్లాలో శాయంపేట చేనేతకు నిలయంగా ఉన్నది. అతి పెద్ద సొసైటీ ఇక్కడ ఉండటంతో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 12 చేనేత సంఘాల్లో 600 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు చేనేత, జౌళి శాఖ అధికారులు చెబుతున్నారు. శాయంపేటతో పాటు పెద్దకోడెపాక, పెంచికలపేట, రేలకుంట, నాచినపెల్లి, ఇల్లంద, శ్రీనివాస టీసీ, రాయపర్తి, నాగారం, చర్లపల్లి, లక్ష్మిముస్త్యాలపల్లిలో చేనేత సంఘాలున్నాయి. వీటిలో మగ్గం నే సే కార్మికులతో పాటు కండెలు చుట్టే కార్మికులు, వార్పింగ్, వైండింగ్, డైయింగ్ రం గాల్లో పనులు చేస్తున్నారు. ఏండ్ల తరబడి కార్మికులు చేనేతనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. సమైక్య పాలనలో చేనేత రంగంపై ఎలాంటి శ్రద్ధ లేకపోవడంతో ఉపాధి కరువై శాయంపేట నుంచి సూరత్, భీమండి, సిరిసిల్ల వంటి ప్రాంతాలకు కార్మికులు ఉపాధి కోసం వెళ్లిపోయారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల క్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి పథకాలను అమలు చేస్తుండడంతో వలస వెళ్లిన కార్మికులను తిరిగి వస్తున్నారు.
‘నేతన్నకు చేయూత’..
మొదటగా మ గ్గాలన్నింటిని జియోట్యాగింగ్ చేసి ప్రత్యేక గుర్తింపు నంబర్లు అందజేశారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘నేతన్నకు చేయూత’ పేరుతో పొదుపు పథకాన్ని అమలు చేస్తున్నది. కార్మికుడి వేతనంలో 8 శాతం జమ చేస్తే మరో 16 శాతం నిధులను దానికి ప్రభుత్వం జమ చేసి మూడు సంవత్సరాలకు ఆ మొత్తాన్ని అందించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో దాదాపు కార్మికులందరూ చేరి ప్రయోజ నం పొందుతున్నారు. అలాగే డైయింగ్ రంగంలోనూ సర్కారు ఊతమిస్తున్నది. చేనేత మిత్ర పథకం పేరుతో రంగులు, రసాయనాలకు నలబై శాతం సబ్సిడీని అందజేస్తున్నది. ఈ సబ్సిడీని సంఘంతో పాటు కార్మికులకు అందజేస్తూ చేదోడుగా నిలుస్తోంది. సబ్సిడీని నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేస్తున్నది. చేనేత లక్ష్మి పథకంతో చేనేత వస్ర్తాల కొనుగోలుకు ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది. సంఘాల్లో కార్మికులు తయారు చేస్తున్న వస్ర్తాలను టెస్కో సంస్థ ద్వారా కొనుగోలు చేస్తు అండగా నిలుస్తున్నది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్తో పాటు బతుకమ్మ చీరెల తయారీ చేనేతలకు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
ఈ నేపథ్యంలో మరో కొత్త పథకాన్ని చేనేతలకు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణ యం తీసుకున్నారు. రైతులకు రూ.5లక్షల బీమా కల్పిస్తున్నట్లుగానే నేతన్నలకు రూ.5లక్షల బీమా కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సెంటు భూమి ఉండి ధరణిలో నమోదైన ప్రతి రైతుకూ బీమా కల్పించా రు. రైతు మరణిస్తే కొద్ది రోజుల్లోనే రూ.5లక్షలను ఆ కుటుంబానికి అందించి అండగా నిలుస్తున్నది సర్కారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇదే తరహాలో చేనేత కార్మికులకు బీమా కల్పించి కుటుంబాలకు ధీమా ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైందటున్నారు. త్వరలోనే విధివిధానాలు వెల్లడి కానున్నట్లు చేనేత, జౌళి శాఖ అధికారులు వెల్లడించారు. చేనేత, జౌళి శాఖ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ.. చేనేత కార్మికులకు బీమా పథకం పై ఇంకా విధివిధానాలు రాలేదని చెప్పారు. కార్మికుల పాలిట ఎంతోమంచి పథకమని త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు.
సీఎంకు కార్మికులు రుణపడి ఉంటారు..
చేనేత రంగంపై ప్రత్యేక శ్రద్ధతో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో మంచిరోజులు వస్తాయని ఆశగా ఉన్నది. రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడం హర్షణీయం. ఎన్నో ఏండ్ల నుంచి కుల వృత్తిగా వస్తున్న చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవడం అభినందనీయం. చేనేతరంగంలో వృద్ధులు అధికంగా పని చేస్తున్నారు. అందువల్ల వయసుతో నిమిత్తం లేకుండా బీమా సౌకర్యం కల్పిస్తే ఆ కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. పొదుపు పథకంపై ఉత్తర్వులను త్వరగా ఇవ్వాలి. బీమాతో కార్మికుల్లో ధీమా కల్పిస్తున్న కేసీఆర్కు కార్మికులంతా రుణపడి ఉంటారు.