వరంగల్, జూలై 28 : చారిత్రక వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కృషి చేస్తున్నది. ‘అలయెన్స్ టూ ఎండ్ ప్లా స్టిక్ వేస్ట్ ప్రాజెక్ట్’లో భాగంగా అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అయిన ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇన్సియేషన్ (ఐసీఎల్ఈఐ)’తో ఒప్పం దం కుదుర్చుకున్నది. నగరంలో రోజూ సేకరించే ప్లాస్టిక్ను శుద్ధి చేసేందుకు ‘ఇక్లీ’ సంస్థ ఫారిన్ ఫండ్ కోసం సహకారం అందించనుంది. దేశంలో ప్లాస్టిక్ ఫ్రీ నగరాలను తీర్చిదిద్దేందుకు ఫారిన్ ఫండ్ కోసం జరిగిన నామినేషన్లలో 10 నగరాలు పోటీ పడగా అందులో వరంగ ల్ నామినేట్ అయింది. దీంతో రెండు రోజుల కిత్రం అధికారులు ఇక్లీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
క్షేత్రస్థాయిలో అధ్యయనం..
నగరంలో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్పై ఇక్లీ సంస్థ త్వరలోనే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. నగరంలో ఏ యే రకాల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు? ఏయే సెంట ర్ల నుంచి ఎంత ప్లాస్టిక్ వస్తున్నది? అనే అంశాలపై తేల్చనున్నది. గేటర్ కార్పొరేషన్ను నాలుగు జోన్లుగా విభజించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. ముఖ్యం గా ఇంటి నుంచి వచ్చే చెత్తలో ప్లాస్టిక్ ఎంత ఉంటున్నది? కమర్షియల్ సెక్టార్ నుంచి ఎంత వస్తున్నదనే దానిపై దృష్టిసారించనుంది. డిసెంబర్ నాటికి వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంపూర్ణ నివేదిక ఇక్లీ సంస్థ అందించనుంది.
ఫారిన్ ఫండ్తో ప్లాంట్..
అంతర్జాతీయ సంస్థల ఫండింగ్ కోసం జరిగిన పోటీలో నామినేట్ అయిన వరంగల్ నగరంలో త్వరలో ఫారిన్ ఫండ్తో ప్లాస్టిక్ వ్యర్థాల రీ సైక్లింగ్, రీ యూజ్ చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జూన్ , డిసెంబర్లో ప్లాస్టిక్ నిర్మూలనకు నిధులు ఇచ్చే సంస్థల సమావేశం జరుగుతుంది. ఇక్లీ సంస్థ నగరంలో క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్పై అధ్యయనం చేసి డిసెంబర్లో జరిగే సమావేశంలో ప్రజెంటేషన్ చేయనుంది. రోజూ ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలపై ఒక అంచనాకు వచ్చి నగరంలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కావాల్సిన నిధులను అంతర్జాతీయ సంస్థలు సమకూర్చుతాయి. ప్లాంట్ ఏర్పాటు తర్వాత నిర్వహణ ఖర్చులను ప్లాస్టిక్ వ్యర్థాల రీయూజ్ ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో గ్రేటర్ కార్పొరేషన్ కో ఫండింగ్ చేయాలి. ఇది ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే ‘బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్’ నిధులతో అమ్మవారిపేటలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటు చేశారు.ఈ వ్యర్థాల ద్వారా ఉత్పత్తి చేసిన ఎరువులను విక్రయిస్తూ ఆదాయం సమకూర్చుకుంటూ ప్లాంట్ నిర్వహిస్తున్నారు.
రోజుకు వంద టన్నుల వ్యర్థాలు..
గ్రేటర్ కార్పొరేషన్లో రోజుకు వంద టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. రోజూ నగరంలో 404 టన్నుల చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అందులో సుమారు 80 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయని బల్దియా అధికారులు చెబుతున్నారు. మరో 20 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పాత సామాన్లు కొనుగోలు చేసే వారు సేకరిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. రోజూ ఇంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్న నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో గ్రేటర్ అధికారులు చర్యలు చేపట్టారు.