రాయపర్తి, అక్టోబర్ 19: ప్రపంచంలో శాంతి స్థాపనకు ఇస్లాంమత ప్రవక్త మహ్మద్ హజ్రత్ ముస్తఫా సలల్లాహు అలైహీ వసల్లాం బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని మండలకేంద్రంలోని మసీద్-ఏ-నూర్, మసీద్-ఏ-ఆలంగీర్ కమిటీల సదర్సాహెబ్లు మహ్మద్ లాయఖ్ అలీ, మహ్మద్ నయీం అన్నారు. మండలవ్యాప్తంగా ముస్లిం కుటుంబాలు మంగళవారం మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్-ఉన్-నబీ పర్వదిన వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ఇరు మసీద్ కమిటీల నేతృత్వంలో రాయపర్తి, కొత్త రాయపర్తి గ్రామాలకు చెందిన ముస్లిం మత పెద్దలు, యువకులు ప్రధాన వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మానవులు నీతి, నిజాయితీ, మర్యాద, ప్రవర్తన, ప్రేమ, కరుణ కలిగి జీవించాలని మహ్మద్ ప్రవక్త సూచించినట్లు వివరించారు. అనంతరం రాత్రి సమయంలో ముస్లింలు కొవ్వొత్తులు వెలిగించి ప్రవక్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో ముస్లింలు అబ్దుల్ ఘనీ, అలీ షరీఫ్, ఫయాజొద్దీన్, మన్నన్, ఫెరోజ్ఖాన్, అఫ్రోజ్ఖాన్, సమీర్, సల్మాన్పాషా, రియాజొద్దీన్, మహ్మద్ రహీమొద్దీన్ పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మేయర్
మట్టెవాడ/నర్సంపేట/వరంగల్ చౌరస్తా: వరంగల్ 29వ డివిజన్ పాపయ్యపేట మసీదు వద్ద మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. వీ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కల్పలత సూపర్బజార్ వైస్ చైర్మన్ ఎండీ షఫీ, టీఆర్ఎస్ నాయకులు ఎస్కే రెహమాన్, ఎండీ అక్బర్, యాకోబు, ఫరాజ్ సాదిక్, హర్షద్, హైమద్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డులో ఉన్న దర్గా నుంచి వరంగల్ రోడ్డు వరకు ముస్లింలు జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రషీద్, అహ్మద్, హఫీజ్, షరీఫ్, ఖలీల్, యాకూబ్, రషీద్, మున్ను, మౌలానా షాహిద్, అఫ్జల్, అప్రోజ్, అఖిల్, జలీల్, రియాజ్, తాజ్, అన్వర్పాషా పాల్గొన్నారు. వరంగల్ చౌరస్తాలో షేక్ అమీరొద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి ప్రారంభించారు. యాకూబ్ పాషా, అహ్మద్, అబ్దుల్, చాంద్పాషా, జావిద్, మున్నా పాల్గొన్నారు.
పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలి
కరీమాబాద్/ఖిలావరంగల్/పర్వతగిరి/మట్టెవాడ/కాశీబుగ్గ: పండుగలను ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జరుపుకోవాలని వరంగల్ 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ కోరారు. మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా డివిజన్లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పండుగలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో పోశాల స్వామి, టీఆర్ఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. వరంగల్ 17వ డివిజన్ ఆదర్శనగర్లో షర్బత్ పంపిణీ చేశారు. టీఆర్ఎస్ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు గోపగాని శంకర్, బాబా, రియాజ్, అంజద్, రఫీక్, ఫఖ్రుద్దీన్, జరీనా, టీఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి, సుంకు శ్రీకాంత్, మిర్యాల రాజు, గండ్రాతి ప్రభాకర్, ధర్మానాయక్ పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్, కొంకపాక, చౌటపెల్లి, సోమారం, ఏనుగల్లు, చింతనెక్కొండ, గోపనపల్లిలో మిలాద్-ఉన్-నబీని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్ మండిబజార్లో మిఠాయిలు పంపిణీ చేశారు. మండిబజార్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు సురేశ్జోషి, ఫుర్ఖాన్ పాల్గొని ప్రత్యేక మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మాసుఖ్, మసియొద్దీన్, మునీర్, అఫ్జల్ పాల్గొన్నారు. ముస్లిం యువకులు ర్యాలీ తీశారు. వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు జన్ను అనిల్, ఎండీ మసూద్ మాట్లాడుతూ కులమతాలకతీతంగా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, గ్రామ అధ్యక్షుడు శీర్ల రవీందర్, బుద్ధ వెంకన్న, శ్రీను, మసూద్ ఉస్మాన్, రబ్బాని, ఆదాం, అంకుషావళి పాల్గొన్నారు.