హనుమకొండ, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీ ఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరి త కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ఎంపీటీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటా యించినందుకు మంత్రికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎంపీపీలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రా మాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్న మహాత్మాగాంధీ ఆశయాలను నిజం చేసే దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగా ణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అన్నా రు. పల్లెల్లో కొత్త కాంతులు నింపేందుకు తెలంగా ణ పంచాయతీరాజ్ చట్ట-2018ను సమర్థవం తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
వివిధ అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు కొరత ఉండొద్దనే లక్ష్యంతో ప్రతి నెలా రూ.227.50 కోట్ల గ్రాంటును గ్రామీణ స్థానిక సంస్థలకు విడుద ల చేస్తున్నామని చెప్పారు. అందులో గ్రామపంచా యతీలకు రూ. 210.44 కోట్లు, మండల పరిషత్ లకు రూ.11.41 కోట్లు, జిల్లా పరిషత్లకు రూ. 5.65 కోట్లు అందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ. 6 వేల 955 కోట్లు గ్రామీణ స్థా నిక సంస్థలకు విడుదల చేశామన్నారు. దేశంలో ఎకడా లేనివిధంగా 2021-22 ఆర్థిక సంవత్స రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్ లకు రూ.251 కోట్లు, మండల పరిషత్లకు రూ. 249 కోట్లు కేటాయించారని చెప్పారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చద నం పరిశుభ్రత పెంపొందించాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నాలుగు విడుతల్లో చేపట్టి విజయవంతంగా నిర్వహించారన్నారు. పల్లె ప్రగ తి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రణాళిక రూపొందించి అమ లు చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులకు గౌరవ వేతనం పెంచి, వారి ఆత్మగౌరవా న్ని పెంపొందించిన నాయకుడు మన ముఖ్యమం త్రి కేసీఆర్ అని దయాకర్రావు కొనియాడారు.