వరంగల్, సెప్టెంబర్ 28(నమస్తేతెలంగాణ): గ్రామీ ణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు ఇప్ప టికే ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు వైద్యులు, సి బ్బంది సంఖ్యను పెంచింది. మందుల కొరత వంటివి తలెత్తకుండా పీహెచ్సీలను బలోపేతం చేసింది. వీడి యోకాల్ ద్వారా పీహెచ్సీల్లో గ్రామీణ ప్రజలు ప్ర త్యే క వైద్య నిపుణుల సేవలను కూడా పొందే అవకాశా న్ని ఇటీవల కల్పించింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజ లకు వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు పల్లె దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో 33 పల్లె దవాఖానలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పీహెచ్సీల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తు న్నాయి. వీటి పరిధిలో సబ్ సెంటర్లు పనిచేస్తున్నప్ప టికీ వాటిలో వైద్యులు ఉండరు. కేవలం ఏఎన్ఎం వంటి సిబ్బంది మాత్రమే ఉంటారు. దీంతో ఆయా పీహెచ్సీ పరిధిలోని గ్రామాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం వైద్యులు పనిచేసే పీహెచ్సీకి చేరుకోవా ల్సి వస్తుంది. ఫలితంగా పీహెచ్సీలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభు త్వం గుర్తించింది. దీంతో ఆయా సీహెచ్సీ పరిధిలో దూరంగా ఉన్న గ్రామాల ప్రజల కోసం ప్రస్తుతం అం దుబాటులో ఉన్న సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వాటిని వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసింది. జిల్లాలో 33 సబ్ సెంటర్లలో పల్లె దవాఖానల ఏర్పాటుకు ప్రతిపాదించ గా సర్కారు కొద్దిరోజుల క్రితం ఆమోదముద్ర వేసింది. దుగ్గొండి, గీసుగొండ, ఖానాపురం, నల్లబెల్లి, సంగెం మండలాల పరిధిలోని ఈ 33 సబ్ సెంటర్లను పల్లె దవఖానలుగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏ ర్పాట్లు చేసింది. ఈ హాస్పిటళ్లలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేయడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు జిల్లా కలెక్టర్ గోపి సో మవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పాటు ఈ పల్లె దవాఖానల నిర్వహణకు పక్కా భవనాల నిర్మా ణం, మౌలిక వసతులు సమకూర్చే ప్రతిపాదనలనూ ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
ఆ సబ్ సెంటర్లు ఇవే
దుగ్గొండి మండలంలో 5, గీసుగొండ మండలం లో 7, ఖానాపురం మండలంలో 6, నల్లబెల్లి మండ లంలో 7, సంగెం మండలంలో 8 సబ్ సెంటర్ల స్థాయి పెంచి వీటిని పల్లె దవఖానలుగా మార్చేందుకు ప్రభు త్వం నిర్ణయించింది. దుగ్గొండి మండలంలో మ ల్లంప ల్లి, వెంకటాపురం, మందపల్లి, తొగర్రాయి, తి మ్మంపే ట, గీసుగొండ మండలంలో మనుగొండ, గొర్రెకుం ట, మొగిలిచర్ల, వంచనగిరి, ఊకల్, కొమ్మాల, ఎలు కుర్తి, ఖానాపురం మండలం కొత్తూరు, అశోక్నగ ర్-1, అశోక్నగర్-2, బుధరావుపేట, ధర్మారావుపే ట, మంగళవారిపేట, నల్లబెల్లి మండలం రాంపూర్, గో విందాపూర్, రేలకుంట, లెంకాలపల్లి, కన్నారావుపేట, ముచ్చింపుల, మేడపల్లి, సంగెం మండలం రంగంపే ట, మొండ్రాయి, వెంకటాపూర్, చింతలపల్లి, కాపులక నపర్తి, గవిచర్ల, లోహిత, తీగరాజుపల్లి సబ్ సెంట ర్లు పల్లె దవాఖానలుగా అభివృద్ధి చెందనున్నాయి. వీటి ల్లో తొలివిడుత కాంట్రాక్టు పద్ధతిన ఎంబీబీఎస్ డా క్టర్లను నియమించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు బుధవారం నుంచి దరఖాస్తులను స్వీకరిం చనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటర మణ వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 12 తుది గడువుగా ప్రకటించారు.