నర్సంపేట, జూన్ 8 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలో లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. అత్యవసర సర్వీసులకు అనుమతి ఉందని, సడలింపు వేళల్లో అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని ఫణీందర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎవరూ బయటకు రావొద్దన్నారు. ఈ కార్యక్రమలో డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, ఎస్సై ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండల కేంద్రంలో మంగళవారం ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది లాక్డౌన్ను పర్యవేక్షించారు. నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై అనవసరంగా వచ్చిన 20 మంది వాహనదారులకు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా తిరుగుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్, రాము పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి : కరోనా నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్సై నడిమెట్ల రవికిరణ్ హెచ్చరించారు. సోమవారం రాత్రి మండలంలోని మద్దునూరులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి మద్యాన్ని సీజ్ చేశారు. గ్రామానికి చెందిన బోళ్లపల్లి అచ్చయ్య, బోళ్లపల్లి చేరాలు వద్ద నుంచి రూ.4500 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రవికిరణ్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస సిబ్బంది పాల్గొన్నారు.