గీసుగొండ,ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఎంసీపీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో మండలంలోని కొమ్మాల, పోగుల ఆగయ్యనగర్ కాలనీలో నిరసన అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు బ్రహ్మచారి, ఎంసీపీఐ (యూ) నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, జశ్వంత్, శ్రీను, స్వామి, రవీందర్, నర్సయ్య, బుచ్చయ్య, మల్లికార్జున్, స్వామి, సంధ్య, అనిత, కుమారస్వామి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల నడ్డివిరుస్తున్న కేంద్రం
ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతుల నడ్డివిరుస్తున్నదని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మల సాంబయ్య ఆరోపించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయని పక్షంలో ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తుమ్మ విజయ్కుమార్, గాయల కుమార్, దశరథం, రజిత, రాధిక, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలి
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలని ఐఎఫ్టీయూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ మాట్లాడుతూ.. చట్టాల సవరణ పేరుతో నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్రంపై కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మాందాటి శ్రీను, బండి వెంకట్, నాగెల్లి శ్రీను, చెన్నబోయిన సాయిలు, మేకల రమేశ్, నీలరాజు, గంట రమేశ్, మార్గం శ్రీను, బొమ్మగాని సతీశ్,బొమ్మగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మోదీ పతనం తప్పదు
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేశ్ హెచ్చరించారు. నర్సంపేటలో రైతులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కన్నం వెంకన్న, మహమ్మద్ రజా, బాబురావు, రంజాన్, వేణు, మాధవ్, రమేశ్ పాల్గొన్నారు.