కమలాపూర్, ఆగస్టు 1 : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతోంది. కమలాపూర్, నేరెళ్ల, మాదన్నపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తు న్నాయన్నారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మె జార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కాగా, కమలాపూర్కు చెందిన పుల్ల శ్రీనివాస్, రాజు, హరికృష్ణ, శనిగరపు పవన్, కొయ్యడ సునిల్, శనిగరపు కిరణ్, రమేశ్, పుల్ల ప్రవీణ్ కుమార్, ఒస్కుల శ్రీకాంత్, తులసి ప్రకాశ్, మాట్ల నరేశ్, పుల్ల రమేశ్, రాకేశ్, మాదన్నపేటకు చెందిన బండి అం జయ్య, గందెపు గణేశ్, బండి హరీశ్, రవీందర్, కుమారస్వామి, రవి, కిన్నెర వెంకటేశ్, గందెపు సమ్మయ్య, కంకుల రాజుతో పాటు 40మంది టీఆర్ఎస్లో చేరారు. అలాగే, నేరెళ్లకు చెందిన కొడెపాక శ్రీనివాస్, గొల్కొండ రాజయ్య, గొల్కొం డ నాగరాజు కూడా టీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి రవీందర్రావు, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, పింగిళి ప్రదీప్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉప్పల్ గ్రామంలో..
మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి మొండెద్దుల నాగరాజు ఆదివారం టీఆర్ఎస్ నాయకుడు నాయినేని తిరుపతిరావు ఆధ్వర్యంలో చేరారు. సీఎం కేసీఆర్ చూపట్టే అభివృద్ధి పనులు నచ్చి, పార్టీలో చేరుతున్నట్లు నాగరాజు తెలిపారు. అలాగే, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 20 మంది కూడా పార్టీలో చేరగా తిరుపతిరావు కండువా కప్పి ఆహ్వానించారు కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్రావు, నాయకులు దేశిని శ్రీనివాస్, మారపల్లి నవీన్కుమార్, సయ్యద్ ముజీబ్ హుస్సేన్, తుర్పాటి పైడి, కొనుపుల రాంచందర్, మహారాజు స్వామి, కొండ రమేశ్ పాల్గొన్నారు.