కమలాపూర్, సెప్టెంబరు 20 : మండలంలోని మర్రిపల్లి దళితులు టీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలిపినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మర్రిపల్లిలో దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏ రాష్ట్రం లో లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప నులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమ కో సం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు తట్టుకోవడం లేదన్నారు. దళితబంధు పథకం అమలుతో ప్రతిపక్షాలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అనంతరం వంగపల్లి గ్రామంలో గౌడకులస్తులతో సమావేశమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన చందుపట్ల వెంకట్రెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, ఎంపీటీసీలు రామస్వామి, లింగారెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు సరోత్తంరెడ్డి, పోడేటి సారయ్య పాల్గొన్నారు.
మున్నూరు కాపుల వినతి
పరకాల : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరుతూ మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కన్వీనర్ బొజ్జరం రమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని హన్మకొండలోని కలిసి వినతిపత్రం అందజేశారు. మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గజ్జెల శ్రీనివాస్, గజ్జి రవి, నల్లెల్ల శ్రీనివాస్, పంచగిరి సంపత్, గోనెల చంద్రమోహన్, తోట రాజేందర్ పాల్గొన్నారు.
నేడు విస్తృత స్థాయి సమావేశం
టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం ములుగు రోడ్డు సమీపంలోని కేఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. సమావేశంలో పరకాల, ఆత్మకూరు, సంగెం, గీసుకొండ, దామెర, నడికూడ మండలాల కమిటీలను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ డాక్టర్ ఎం సుధీర్ బాబు, సీనియర్ నాయకుడు కరిమిండ్ల బాబురావు హాజరు కానున్నట్లు తెలిపారు.