చెన్నారావుపేట/నల్లబెల్లి/ఆత్మకూరు/రాయపర్తి, ఆగస్టు 1: చెన్నారావుపేటలో ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బాండ్ కట్టుకొని స్నేహితుల దినోత్సవాన్ని పార్టీ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, జాగృతి మండలాధ్యక్షుడు మూడు రమేశ్, టీఆర్ఎస్ నాయకులు కుసుమ నరేందర్, కందిక సునీల్, ఎడ్ల రమేశ్, సూత్రపు సుధాకర్ పాల్గొన్నారు. నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా యువత తమ స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్కు చెందిన మాడిపల్లి రాజు ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
ఈ మేరకు రాజు కుటుంబానికి 1998-99 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు రూ. 33,000 ఆర్థిక సాయం అందజేసి తామున్నామంటూ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాదాసి రాజు, వడ్డేపల్లి ప్రసాద్, కోటి, రమేశ్, రవి, చిన్నయ్య, చందర్, అనిల్ పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో సకల వర్గాల ప్రజలు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బాల్యమిత్రులంతా ఒకచోట కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ చిన్నానాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మండలకేంద్రంలో 1987 బ్యాచ్ పదో తరగతి మిత్రబృందం సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి కేక్కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎనగందుల యాదగిరి, బుద్ద సత్యనారాయణ, వై కొమురెల్లి, మైస రమేశ్, కంది ప్రభాకర్ పాల్గొన్నారు.