శాయంపేట: ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా మండలకేంద్రంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ కందగట్ల రవి పాల్గొని సీనియర్ ఆటో డ్రైవర్లు దిండిగాల మురళి, బూర సంతోష్ను సత్కరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దైనంపెల్లి సుమన్, ఆటో యూనియన్ అధ్యక్షుడు మారెపల్లి కట్టయ్య, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, డ్రైవర్లు పాల్గొన్నారు.
తాడు ఆధ్వర్యంలో వేడుకలు
దుగ్గొండి: తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (తాడు) ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని గిర్నిబావిలోని ఆటో అడ్డా వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై నవీన్కుమార్, తాడు రాష్ట్ర అడ్వైజరీ బోర్డు సభ్యుడు శానబోయిన రాజ్కుమార్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సైని ఆటో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఎస్సై పర్వీన్, తాడు మండల కమిటీ సలహాదారులు మోడెం విద్యాసాగర్గౌడ్, ఎలంగొండ నర్సింహరాములు, మండలాధ్యక్షుడు చిరంజీవి, తెలప్ప శంకర్, దండు రాజు, రామనాథం, అఖిల్, రాజు, సాంబయ్య, సూరయ్య, దేవేందర్, రాజు, కోటి, అశోక్, బత్తుల బాబు, నర్సయ్య, దుగ్గొండి, తిమ్మంపేట, పొనకల్, మహ్మదాపురంతోపాటు వివిధ గ్రామాల ఆటో యూనియన్ బాధ్యులు పాల్గొన్నారు.
దామెర: ఊరుగొండలో శ్రీలక్ష్మీనర్సింహ ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలెపాక రాజు ఆధ్వర్యంలో కార్మికులు గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. పులుకుర్తి, దామెర, ముస్త్యాలపల్లిలో ఆటో కార్మికులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు జన్ను కుమారస్వామి, పోలెపాక రమేశ్, గూడూరి విజేందర్, పోలెపాక రాజేందర్, భిక్షపతి, సునీల్, నల్ల రాజు పాల్గొన్నారు.