నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి/నల్లబెల్లి/రాయపర్తి, సెప్టెంబర్ 26: నర్సంపేట పట్టణంలో ఆదివారం చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను టీఆర్ఎస్ సర్కారు గుర్తించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, శీలం రాంబాబు, రుద్ర ఓంప్రకాశ్, గంప రాజేశ్వర్, రాయిడి దుశ్యంత్రెడ్డి, గందె చంద్రమౌళి, దేవోజు సదానందం, పుట్టపాక కుమారస్వామి, మందప్రకాశ్, మినుముల రాజు, గోల్య, శానిటేషన్ అధికారి నాగరాజు పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటాన్ని ప్రతి జీపీ ఎదుట ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లందుల సాంబయ్య కోరారు. ఐలమ్మ జయంతిలో నాయకులు బాలనర్సయ్య, సదానందం, కుమారస్వామి, రాంబాబు, కాంతారావు, బాబు, రాంనర్సయ్య, వెంకటయ్య, నరేశ్ పాల్గొన్నారు. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో చాకలి ఐలమ్మ 126వ జయంతి నిర్వహించారు. సర్పంచ్ కుండె మల్లయ్య పాల్గొన్నారు. తహసీల్లో గిర్ధావర్ స్వామి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలకిషన్గౌడ్, వార్డు సభ్యుడు శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నర్సయ్య, రాంబాబు, జీపీ సిబ్బంది సాంబయ్య, తహసీల్ సిబ్బంది పాల్గొన్నారు.
దుగ్గొండిలోని మండల పరిషత్ కార్యాయలంలో ఎంపీపీ కాట్ల కోమల, ఎంపీడీవో కృష్ణప్రసాద్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరన్న, కాట్ల భద్రయ్య, కొంగర అరుణారవి, ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, బండి జగన్, మోర్తాల రాజు పాల్గొన్నారు. నల్లబెల్లిలో జరిగిన ఐలమ్మ జయంతిలో సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ రమేశ్బాబు, సీనియర్ అసిస్టెంట్ అంజయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గందె శ్రీనివాస్గుప్తా, రజక సంఘం అధ్యక్షుడు రాపాల లక్ష్మీనారాయణ, నాగెల్లి మొగిలి, ఎంపీసీటీ జన్ను జయరావ్, వైనాల రాజు, వీరస్వామి, జక్కయ్య, శ్రీను, రుద్రయ్య, కిరణ్ పాల్గొన్నారు. రాయపర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి డీపీవోతో కలిసి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ రంగు కుమారస్వామి, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఏపీవో కుమార్గౌడ్, జాజునాయక్, జూనియర్ అసిస్టెంట్ కిశోర్కుమార్, సంతోష్కుమార్, వరుణ్కుమార్, నాగరాజు, వంశీ పాల్గొన్నారు.
వాడవాడలా ఐలమ్మకు నివాళి
వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆమెకు వాడవాడలా నివాళులర్పించారు. సంగెంలోని అంబేద్కర్ కూడలిలో రజక సంఘం గౌరవ అధ్యక్షుడు మునుకుంట్ల మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మెట్టుపెల్లి మల్లయ్య, మునుకుంట్ల మోహన్, సంగెం సొసైటీ చైర్మన్ కుమారస్వామియాదవ్, రజక సంఘం నాయకులు కోటేశ్వర్, రవి, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, రాములు, కొమురయ్య, ఉప సర్పంచ్ శరత్, నాగార్జునశర్మ, కాపులకనపర్తిలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సారంగపాణి, ఎంపీటీసీ బాలకృష్ణ, ప్రభాకర్ పాల్గొన్నారు. ఖానాపురం మండలం అశోక్నగర్ జీపీలో సర్పంచ్ గొర్రె కవిత ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, బండి వెంకన్న, గొర్రె రవి, తిరుపతిరెడ్డి, ముద్దంగుల సంపత్, రాంబాబు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని రామవరంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సర్పంచ్ల ఫోరం నర్సంపేట మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఉప సర్పంచ్ జినుకల విమల పూలమాలలు వేశారు. కమ్మపల్లిలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. లక్నేపల్లిలో మునుకుంట్ల సునీల్, గొడిశాల లక్ష్మి, ముగ్ధుంపురంలో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. నాయకులు జన్ను రమేశ్, కళ, లక్ష్మి, పుష్ప, బన్ని సాంబయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.
వీరనారికి ఘన నివాళి
నెక్కొండలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మారం రాము, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా నాయకుడు చల్లా చెన్నకేశవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె వెంకన్న, పెద్దకోర్పోలు, అలంకానిపేట, దీక్షకుంట సర్పంచ్ మహబూబ్పాషా, మాదాసు అనంతలక్షి-రవి, ఆలకుంట సురేందర్, నాయకులు సారంగపాణి, రాజిరెడ్డి, యాకయ్య, విజేందర్, రాజు వార్డు సభ్యులు సాంబయ్య, రమేశ్, రాకేశ్ పాల్గొన్నారు. నెక్కొండ జీపీలో సర్పంచ్ సొంటిరెడ్డి యమున ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి జరిగింది. ఉప సర్పంచ్ వీరభద్రయ్య, వార్డు సభ్యులు దిలీప్, ప్రశాంత్, శిరీశ్, కార్యదర్శి గోవిందరాజు పాల్గొన్నారు. గ్రంథాలయంలో పరమాత్మ, యాకయ్య, వెంకటేశ్వర్లు, యాకూబ్ పాల్గొన్నారు. రెడ్లవాడలో సర్పంచ్ రావుల శ్రీలతాప్రసాద్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. గీసుగొండ మండలం గీసుగొండ, ఎలుకుర్తి, ధర్మారంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. గీసుగొండ జీపీలో ఐలమ్మ చిత్రపటానికి సర్పంచ్ దౌడు బాబు పూలమాల వేశారు. వార్డు సభ్యులు రాంబాబు, రాజేశ్, చంద్రమౌళి, చంద్రారెడ్డి, స్థానికులు శంకరయ్య, రాజేందర్, సుధాకర్, రాజు, శ్రీకాంత్, అభిషేక్ పాల్గొన్నారు.