నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 17 : మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువులో గురువారం గల్లంతైన పారిశుధ్య కార్మికుడు పుట్ట రాహుల్ (24) ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది పెద్ద చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల పై అధికారులతో చర్చించారు. రెవెన్యూ, పోలీస్, రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, మాజీ చైర్మన్ నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ఎస్సై రామ్చరణ్, కౌన్సిలర్లు జుర్రు రాజు, గుంటి కిషన్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్లో ఉపసర్పంచ్తో పాటు పలువురి చేరిక..
చెన్నారావుపేట : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖాదర్పేట ఉపసర్పంచ్ కొనుకటి రాజుతో పాటు పెండ్లి రాజశేఖర్, తోటకూర రాజేశ్, గుంటి రాజేందర్, రాజశేఖర్ టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, ఖాదర్పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, వార్డు సభ్యులు తోట రమేశ్, ఎరుకల రాజ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు అరిగెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.