గీసుగొండ/నర్సంపేట/చెన్నారావుపేట/వరంగల్చౌరస్తా/వర్ధన్నపేట/రాయపర్తి/నెక్కొండ/సంగెం/కరీమాబాద్, అక్టోబర్ 24 : గంజాయి, గుట్కాలు విక్రయించొద్దని మా మునూరు ఏసీపీ నరేశ్కుమార్ అన్నారు. ఆదివారం గీసుగొండ పోలీస్ష్టేషన్తో పాటు గ్రేటర్ వరంగల్ 16వ డివిజ న్ కీర్తినగర్లో కిరాణా, పాన్షాపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. గ్రామాల్లో గంజాయి విక్రయించడంతో పాటు రవా ణా చేసే వారి వివరాలను పోలీసులకు అందించాలన్నారు. గంజాయి, గుట్కాలు విక్రయించే వారిపై పీడీయాక్టు నమో దు చేస్తామని హెచ్చరించారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై పెండ్యాల దేవేందర్ పాల్గొన్నారు. నిషేధిక గంజాయి, గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఎస్సై రాంచరణ్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని వివిధ షాపులు, కిరాణాలు, పాన్ షాపుల్లో తనిఖీలు చేశారు. మండలంలో గంజాయి, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చెన్నారావుపేట ఎస్సై శీలం రవి హెచ్చరించారు. పోలీస్స్టేషన్లో కిరాణా దుకాణాలు, పాన్షాప్ యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. డబ్బు సం పాదించాలనే ఆలోచనలతో పొగాకు ఉత్పత్తులు అమ్ముతూ యువత జీవితాలను బలి చేయొద్దని ఇంతేజార్గంజ్ సీఐ మల్లేశ్ అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపుల ని ర్వాహకులతో మాట్లాడారు.
ఇకపై ఈ ఉత్పత్తులు విక్రయిం చి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్సై స్వామి ఉన్నారు. పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట సీఐ సదన్కుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలువురు పాన్షాపు నిర్వాహకులకు పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. పొ గాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాయపర్తి ఎస్సై బండారి రాజు హెచ్చరించారు. మండల కేంద్రంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలను సిబ్బందితో కలి సి తనిఖీ చేశారు. సిబ్బంది తూళ్ల సంపత్కుమార్, కత్తుల శ్రీనివాస్, గొళ్లెన రమేశ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. నె క్కొండ మండలంలో పాన్షాపులు, కిరాణా షాపుల్లో నిషేధిత గుట్కాలు, అంబర్ ప్యాకెట్లతో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ పు ప్పాల తిరుమల్ హెచ్చరించారు. పోలీస్స్టేషన్లో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో వ్యాపారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సం గెం మండలంలో గుట్కాలు, మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై భాస్కర్రెడ్డి హెచ్చరించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో దుకాణాదారులతో ఎస్సై సమావేశం నిర్వహించారు. ఏఎస్సై వెంకన్న, సిబ్బంది ఉన్నారు. కిరాణా, పాన్షాపు యజమానులు నిషేధిత పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మామునూరు సీఐ రమేశ్ హెచ్చరించారు. మామునూరు పోలీస్స్టేషన్ ఆవరణలో షాపుల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్ఐ అబ్దుల్హ్రీమ్, సిబ్బంది ఉన్నారు.