వరంగల్, సెప్టెంబర్ 19(నమస్తేతెలంగాణ) : గణేశ్ నిమజ్జ నం కనుల పండువలా జరిగింది. విశేష పూజలందుకున్న గణ నాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. పోయిరా గణపయ్యా… పో యిరావయ్యా.. అంటూ భక్తులు నిమజ్జనం చేశారు. వర్షంలో నూ నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. వినాయక చవితిని పు రస్కరించుకుని ఈ నెల 10న వాడవాడలా విఘ్నేశ్వరుడు కొలు వు దీరాడు. ప్రజలు భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరు పుకున్నారు. పదో రోజు ఆదివారం జిల్లాలో గణేశ్ నిమజ్జనం జరిగింది. గణనాథుడి శోభాయాత్ర, నిమజ్జనం కోసం అధి కారులు కొద్ది రోజుల ముందు నుంచే విస్తృత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, లైట్లు, క్రేన్లను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్ల ను, తెప్పలు, బోట్లను అందుబాటులో పెట్టారు. నిమజ్జనం జరి గే చెరువుల వద్దకు చేరుకునే అప్రోచ్ రోడ్లను మరమ్మతు చేశా రు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు కలెక్టర్ గోపి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించా రు. పోలీసులు జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోషి, కలెక్టర్ గోపి, జీడ బ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ బీ హరిసిం గ్ నిమజ్జన ప్రదేశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్లో కొన్ని రూట్లలో ట్రాఫిక్ మళ్లించారు. నిమజ్జనం సమయంలో రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అయినా వానలోనే గణేశ్ నిమజ్జనం చేశారు.
వాడవాడలా శోభాయాత్ర..
జిల్లాలో ఊరూరా, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణం, వరంగ ల్ నగరంలోని వివిధ చెరువుల వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు జరిగాయి. మధ్యాహ్నం నుంచే నిమజ్జన కార్యక్రమం మొదలైం ది. వరంగల్ దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు చెరువు, బెస్తం చెరువు, కట్టమల్లన్న చెరువుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథులను నిమజ్జనం చేశారు. జైజై గణేశా… బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. ఆయా గ్రామం, నర్సం పేట, వర్ధన్నపేట పట్టణంలోని చెరువుల వద్ద భక్తులు ఉత్సాహం గా గణనాథుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు వినాయక మండపాల నుంచి నిమజ్జన ప్రదేశం వరకూ విఘ్నే శ్వరుడితో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. అన్నివర్గాల ప్రజలు శోభాయాత్రలో పాల్గొని గణపయ్యకు సెలవు పలికారు. శివనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వాణి దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడి 28వ డివిజ న్ పరిధిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఉత్సవాలకు ఎమ్మెల్యే నన్నపునేని హాజరై పూజలు చేశారు. జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. తర్వాత వరంగల్ ఉర్సుగుట్ట చెరు వు నిమజ్జన కేంద్రాన్ని జీడబ్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి సందర్శించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతం గా నిమజ్జనం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. చి న్నవడ్డేపల్లి చెరువుతో పాటు గీసుగొండ మండలంలోని కట్టమ ల్లన్న చెరువును కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య సందర్శించి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు.
కలెక్టర్ పరిశీలన..
గణేశ్ నిమజ్జన ప్రాంతాలను కలెక్టర్ గోపి సందర్శించారు. వరంగల్లోని ఉర్సుగుట్ట చెరువు, దేశాయిపేటలోని చిన్నవడ్డే పల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ప్రత్యేక అధికారులతో కలిసి పరిశీలించారు. పోలీసు, రెవెన్యూ, ట్రాఫిక్, ఇరిగేషన్, వై ద్య, మత్స్య, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన అధి కారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడొ ద్దని, పోలీసులకు సహకరించాలని వినాయకులను తీసుకొచ్చే మండపాల కమిటీలకు ఆయన సూచించారు. నవరాత్రి ఉత్స వాలను ఎంత ఘనంగా నిర్వహించారో నిమజ్జన కార్యక్రమం కూడా అంతే ఘనంగా పూర్తయ్యేలా అధికారులకు సహకరించా లన్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ పర్యవేక్షించాలని కలెక్టర్ నిమజ్జన ప్రదేశాల వద్ద విధులు నిర్వహిస్తున్న స్పెషల్ అధికా రులను ఆదేశించారు. గజ ఈతగాళ్లు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి వినాయక విగ్రహం జాగ్రత్తగా నిమజ్జనం అయ్యేలా చూడాలని, ఎలాంటి అవాంతరాలు జరుగకూడదని గోపి తెలిపారు. చెరు వుల వద్ద లైటింగ్, క్రేన్లతో పాటు ఇతర వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.