నమస్తేతెలంగాణ నెట్వర్క్ : గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణేశుడికి చివరి రోజు ఆదివారం భక్తులు వీడ్కోలు పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డప్పు వాయిద్యాలు, డీజేలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. సిద్ధేశ్వరాలయంలో చివరిరోజు మహాగణపతికి పంచామృతాభిషేకం చేసి, సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేసినట్లు అర్చకులు సిద్ధేశుని రవికుమార్, సురేశ్కుమార్ తెలిపారు. అలాగే, నగరంలోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువును ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు పరిశీలిం చి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట డీఈ జంపాల రాజం, టెక్నికల్ డీఈ అనిల్కుమార్, ఏడీఈ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. హనుమకొండ పద్మాక్షి గుండంలో హనుమకొండ చౌరస్తా, బాలసముద్రం, అడ్వకేట్స్కాలనీ, రాంనగర్, కొత్తూరు జెండా, కిషన్పుర, నయీంనగర్, గోకుల్నగర్, సమ్మయ్యనగర్, కేయూసీ క్రాస్రోడ్డు ప్రాంతాల్లోని విగ్రహాలను నిమజ్జనం చేశారు.
గ్రేటర్ 31, 49 డివిజన్ పరిధిలోని బంధం చెరువులో న్యూశాయంపేట, జులైవాడలోని పలు కాలనీల నుంచి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. కాజీపేట పరిధిలోని సోమిడి చెరువులో మధ్యాహ్నం నుంచే వినాయకుల నిమజ్జనం నిర్వహించారు. సాయంత్రం వర్షంలో సైతం విష్ణుపురి, రహమత్నగర్, బాపూజీనగర్ తదిరత కాలనీల నుంచి గణనాథులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. సోమిడి ఊర చెరువులో దాదాపు 20 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆదేశానుసారం స్థానిక సీఐ మహేందర్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు వెంకటకృష్ణ, సాంబయ్య బందోబస్తు నిర్వహించారు. సీఐ ప్రభాకర్రెడ్డి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండ చర్యలు చేపట్టారు. భీమదేవరపల్లి మండలంలో నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ములుకనూరు, వంగర ఎస్సైలు చంద్రమోహన్, గంజి స్వప్న, ఆయా గ్రామాల సర్పంచ్లు చర్యలు తీసుకున్నారు. ఎల్కతుర్తిలో ఎస్సై గడ్డం ఉమ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు. హసన్పర్తి పెద్దచెరువులో క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు.నీటి పారుదల శాఖ, పోలీస్, ఫైర్ సిబ్బంది చెరువు కట్టపై కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా సీపీ ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్రావు ఆధ్వర్యంలో ఎస్సై సాంబయ్య సిబ్బంది చర్యలు చేపట్టారు.
పరకాల పట్టణంలోని చలివాగు పరిసరాల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేందుకు తరలివచ్చారు. విలీన గ్రామాలైన రాజీపేట, సీతారాంపురం గ్రామ చెరువుల వద్ద కూడా అధికారులు నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. ఏసీపీ శివరామయ్య, సీఐ పింగిళి మహేందర్రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ పెద్ద చెరువు వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని పరకాల ఏసీపీ శివరామయ్య, తహసీల్దార్ సురేశ్కుమార్, సీఐ రంజిత్కుమార్, ఎంపీడీవో నర్మద, ట్రాన్స్కో, నీటిపారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. భక్తులు తీసుకొచ్చిన విగ్రహాలను క్రేన్ల సాయంతో చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్పంచ్ ఎస్కే రబీయాబీ హుస్సేన్ ఏర్పాట్లు చేశారు. దామెర మండలంలో వర్షంలో కూడా నిమజ్జనం కొనసాగింది. ఊరుగొండ, దామెర, పులుకుర్తి, కోగిల్వాయి, వెంకటాపురం, ల్యాదెళ్ల, తక్కళ్లపహాడ్, ఓగ్లాపూర్, దమ్మన్నపేట, సీతారాంపురం, దుర్గంపేట, వెంకటాపురం, సింగరాజుపల్లి, ముస్త్యాలపల్లి గ్రామాల్లో భక్తులు వినాయకున్ని ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు.
చెరువులు, కుంటల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్అలీ పాల్గొన్నారు. శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం శివారులో చలి వాగు ప్రాజెక్టులో నిమజ్జన కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావుతో పాటు నడికూడ తహసీల్దార్ మహేందర్ పర్యవేక్షించారు. వారి వెంట ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, తహసీల్దార్ పోరిక హరికృష్ణ, ఆర్ఐ హేమానాయక్, సీఐ తోగిటి రమేశ్కుమార్, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్, సర్పంచ్ పోతు సుమలత, నాయకులు పోతురమణారెడ్డి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. కాగా, మండల పరిధిలో 121 వినాయక విగ్రహాలకు 98 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని విగ్రహాలను భద్రాచలం తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ధర్మసాగర్ మండలంలోని నిమజ్జన ప్రదేశాల్లో సీఐ రమేశ్కుమార్ యాదవ్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నడికూడ మండల కేంద్రంలో నిమజ్జన ఏర్పాట్లు సర్పంచ్ ఊర రవీందర్రావు పరిశీలించారు. పరకాల సీఐ మహేందర్రెడ్డి, ఎస్సై ప్రశాంత్ ఆదేశాల మేరకు నడికూడ వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు.