వరంగల్, అక్టోబర్ 19(నమస్తేతెలంగాణ) : వానకాలం ధాన్యం కొనుగోలు పై అధికారులు దృష్టి సారించారు. అం చనా మేరకు రైతుల నుంచి నేరుగా వ డ్లను కొనేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా గ్రామాల్లోనే వానకాలం వడ్లను కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శనివారం మార్గదర్శకా లు విడుదల చేశారు. పౌరసరఫరాల శా ఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పరిశీలిస్తే జిల్లాలో వానకాలం వరి పం ట సాధారణ విస్తీర్ణం 31,697 హెక్టా ర్లు. ఈ ఏడాది వరి సాగు సాధారణ వి స్తీర్ణం దాటింది. రైతులు 51,770 హెక్టార్లలో సాగు చేశారు. ఒక్కో హెక్టారుకు 5.88 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అ ధికారుల అంచనా. ఈ లెక్కన 3,04,430 టన్నుల ధాన్యం దిగుబడి రానుంది. ఇందులో నుంచి స్థానిక అవసరాలకు, సీడ్ కోసం పోగా 2,79,430 టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. రైస్మిల్లర్లు 19,430 ట న్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మిగతా 2.60 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చే యాల్సి ఉంటుందని అధికారులు అంచ నా వేశారు. నవంబర్లో 13,000, డిసెంబర్లో 1,36,675, జనవరిలో 99,658, ఫిబ్రవరిలో 10,667 టన్ను ల ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్కు గ్రేడ్ ‘ఏ’ రకం రూ. 1,960, సాధారణ రకం రూ.1,940గా ప్రభుత్వం నిర్ణయించింది.
త్వరలో కొనుగోలు ప్రారంభం..
జిల్లాలో రాయపర్తి, వర్ధన్నపేట, ప ర్వతగిరి తదితర మండలాల్లో నవంబర్ మొదటి వారం నుంచి వరి కోతలు ప్రా రంభం కానున్నాయి. మొదట వరి పం ట కోతలు షురూ అయ్యే మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. దశలవారీగా జిల్లాలో ప్రారంభిం చే కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ కరోనా నిబంధనల ప్రకారం కొనుగోలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నారు. కేం ద్రాల్లో మౌలిక వసతులు సమకూర్చడంపై దృష్టి పెట్టారు. వానకాలం ధా న్యం కొనుగోలు ఏర్పాట్లపై ఈ నెల 22న కలెక్టర్ గోపి సమీక్ష జరుపనున్నా రు. పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసా య, తూనికలు-కొలతల శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
172 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో ఈ వానకాలం 2.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం గ్రామాల్లో 172 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ఐకేపీకి 45, పీఏసీఎస్లకు 107, ఏఎంసీలకు 4, జీసీసీకి 1, రైతు ఉత్పత్తి సంఘాలకు 15 కేటాయించాలని పేర్కొన్నారు. వడ్లను కొనేందుకు 65 లక్షల గన్నీ సంచులు, 3,440 టార్పాలిన్లు అవసరం. ప్రస్తుతం 32,78,068 గన్నీ సంచులు అందుబాటులో ఉన్నట్లు పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. అలాగే 3,326 టార్పాలిన్లు అందుబాటులో ఉండగా మరో 114 కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 116 అందుబాటులో ఉండగా, మరో 56 సమకూర్చుకోవాల్సి ఉంది. తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ స్కేల్స్ అవసరానికి మించి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.