ఖిలావరంగల్, సెప్టెంబర్ 17 : మత్స్యకారులకు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కలెక్టర్ జీ గోపి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వరంగల్ జిల్లా ఏర్పడిన తర్వాత 113 బ్రాంచ్లలో 31 బ్యాంక్ల సహకారంతో లీడ్ బ్యాంక్ ద్వారా జిల్లా క్రెడిట్ కార్డు ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. జూన్లో రూ.1316.64 కోట్లకు గాను రూ. 844.38 కోట్లు, పరిశ్రమలకు రూ. 93.38కోట్లకుగాను రూ. 140.03 కోట్ల రుణాలు అందించామన్నారు. అలాగే ప్రాధాన్యతా రంగాలకు రూ. 2446.66 కోట్లకు గాను రూ.1238.13 కోట్లు ఇచ్చామన్నారు.
ఎకనామికల్ సపోర్టు స్కీంలపై దృషి..
ఎకనామికల్ సపోర్టు స్కీంలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పీఎంఈజీపీ పథకమైన కుటీర పరిశ్రమల రుణాల టార్గెట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా వరంగల్ జిల్లాలో పాడి గేదెల పంపిణీ పథకం తీసుకువచ్చామన్నారు. వ్యవసాయమంటే భూమి దున్ని పంట పండించడమే కాదన్నారు. నర్సంపేటను నాబార్డ్ సహకారంతో మో డల్ అగ్రికల్చర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ప్రభు త్వం తరఫున ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని గతంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారన్నారు. 135వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ ఏడాది వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. సమావేశంలో అ దనపు కలెక్టర్ హరిసింగ్, ఎల్డీఎండీ సత్యజిత్, యూ బీఐ డీజీఎం శంకర్లాల్, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ జోషి, ఐవోబీ ఆర్ఎం అశోకన్ పాల్గొన్నారు.
ఓసిటీ మినీ స్టేడియం పరిశీలన..
కాశీబుగ్గ : ఓసిటీ మినీ స్టేడియాన్ని కలెక్టర్ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఈ స్టేడియాన్ని అందరికీ అందుబాటులోకి తీసు కురావాలని అధికారులకు సూచించారు. స్టేడియం అభివృద్ధికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూ.5కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హన్మకొండ జిల్లా యువజన, క్రీడాధికారి మంజూరు చేసిన రూ.2.50లక్షలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.