కమలాపూర్ : మండలంలోని శనిగరంలో గురువారం ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దళితులు దహనం చేశారు. గ్రామంలోని చర్చి నుంచి పరకాల -హుజూరాబాద్ నాలుగు లైన్ల రహదారి వరకు మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మతో డప్పు చప్పుళ్ల నడుమ శవయాత్ర నిర్వహించి, బస్టాండ్ సెంటర్ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళితులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రకటించగానే ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నట్లు తెలిపారు. దళితులను కించపరిచేవిధంగా వాట్సాప్లో మెసేజ్లు చేసిన ఈటల బావమరిది మధుసూదన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి బొచ్చు కరుణాకర్, కుల పెద్దలు కొర్నేల్, ప్రేమానందం, దళిత బంధు రిసోర్స్పర్సన్ వక్కల మార్కు, నాయకులు వరకుమార్, జైసిల్కుమార్, శ్రీనివాస్ యువకులు పాల్గొన్నారు.
దళితులను కించపరిస్తే ఊరుకోం
దళితులను కించపరిస్తే ఊరుకునేది లేదని కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ హెచ్చరించారు. గురువారం కేయూ మొదటి గేట్ ఎదుట టీఆర్ఎస్వీ విద్యార్థులు ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులను కించపరుస్తూ మెసేజ్లు చేసిన ఈటల బావమరిది మధుసూదన్రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో దళితులు ఈటలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
వర్ధన్నపేటలో..
దళితవర్గాలను అవమానపరిచే విధంగా మెసేజ్లు చేసిన ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన ఎస్సీ విభాగం నాయకులు గురువారం వర్ధన్నపేట జాతీయ రహదారిపై అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈటల, ఆయన బావమరిదికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈఅ సందర్భంగా తూళ్ల కుమారస్వామి మాట్లాడుతూ.. దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఏక్కడా లేనివిధంగా దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారని అన్నారు. విపక్షాలకు చెందిన కొంతమంది నాయకులు అహంకారంతో దళితులను కించపరిచే విధంగా వ్యహరించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మరుపట్ల అరుణ, మంద సతీశ్, కౌన్సిలర్ తుమ్మల రవీందర్, ఎంపీటీసీ మరుపట్ల సురేశ్, కొండేటి శ్రీనివాస్, సుధాకర్, భాస్కర్, యాకాంతం, సాంబయ్య, మాధవ్, భిక్షపతి, కొమురయ్య, వీరస్వామి పాల్గొన్నారు.