భూపాలపల్లి, ఆగస్టు 3 : వక్రబుద్ధి ఓ ఆర్మీ ఉద్యోగి జీవితాన్ని అతలాకుతలం చేసింది. వివాహేతర సం బంధం.. ఆపై మహిళ హత్యతో ఉద్యోగం కోల్పోయి నైతికంగా దిగజారి, జల్సాలకు అలవాటుపడి దొం గతనాలు చేస్తూ చివరికి కటకటాల పాలయ్యాడు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు నిందితుడి వివరాలు వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండ లం రేగులగూడెం శివారు చల్లపల్లి గ్రామానికి చెందిన చల్ల మహేశ్(27) 2004లో ఆర్మీలో చేరాడు. 2011 లో వరంగల్ రైల్వేస్టేషన్లో కేసముద్రానికి చెందిన ఓ మహిళ పరిచయం కాగా, ఆమెతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడు. అదే ఏడాది ఆమెతో గొడవ పడి కేసముద్రంలోని ఆమె ఇంట్లోనే హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మహేశ్ను జైలుకు పంపగా, అతడి ఉద్యోగం పోయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అతడి భార్య కూడా విడాకులిచ్చింది. ఇచ్చిన వరకట్నం అడగడంతో మహేశ్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురాశతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. 2011 నుంచి ఇప్పటివరకు చెల్పూర్, గోదావరిఖని, ఎన్టీపీసీ, కరీంనగర్, చెన్నూర్, హన్మకొండ, రామగిరి, మంథనిలో దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడిపాడు. 2019లో విజయవాడకు వెళ్లి హోటల్లో పనిచేశాడు. సంవత్సరం తర్వాత మహిళ హత్యకేసులో వారెంట్ రాగా, పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
బెయిల్పై వచ్చిన మహేశ్ ఈ ఏడాది మార్చిలో కొయ్యూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కొండంపేట, జూలై 9న మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని పలువురి ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించాడు. అవి అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. జూలై 29న భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో ఓ ఇంట్లో మూడు తులాల బంగారు నక్లెస్, రూ.2 లక్షలు, మరుసటి రోజు భూపాలపల్లి మండలం కమలాపూర్లో ఓ ఇంటి తాళం పగులగొట్టి రూ.10వేల నగదు అపహరించాడు. దొంగిలించిన సొత్తుతో విజయవాడ వెళ్లేందుకు మంగళవారం భూపాలపల్లి బస్స్టేషన్కు వచ్చిన మహేశ్ను డీఎస్పీ నేతృత్వంలో సీఐ వాసుదేవరావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అతడి నుంచి బంగారం, వెండి ఆభరణాలు రూ.2.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ఎస్సై లు అభినవ్, నరేశ్, కానిస్టేబుల్స్ హరికాంత్, వేణు, నవీన్, జితేందర్, శ్రీను సహకరించినట్లు తెలిపారు. వారికి రివార్డు అందజేస్తామన్నారు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామానికి చెందిన దొడ్డ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కూపి లాగితే నిందితుడి నేర చరిత్ర బయటపడిందన్నారు. సమావేశంలో డీఎస్పీ సంపత్రావు, సీఐ వాసుదేవరావు, ఎస్సైలు అభినవ్, నరేశ్ పాల్గొన్నారు.