గీసుగొండ, సెప్టెంబర్ 17 : ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నందనాయక్తండా, కొమ్మాల, గీసుగొండ గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఎలుకుర్తి ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మాధవీలత, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రవీణ్కుమార్, సర్పంచులు బాదావత్ అమ్మి, వీరాటి కవిత, దౌడు బాబు, పూండ్రు జైపాల్రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం తనిఖీ..
పోచమ్మమైదాన్ : వరంగల్ ఎల్బీ నగర్ పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రం, దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సందర్శించారు. వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాశ్, మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, ఏఎన్ఎం అరుణ, సులోచన, లావణ్య, రేణుక, రమ, రబ్బాని, ఆకెన వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ తంగెళ్లపల్లి భరత్కుమార్, సిబ్బంది జన్ను కొర్నేలు, సరస్వతి, అనిల్, కుమార్, నిహారిక పాల్గొన్నారు. 22వ డివిజన్ ఇన్నర్వీల్ కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమారస్వామి, మెడికల్ ఆఫీసర్ భరత్కుమార్ ప్రారంభించారు.
చెన్నారావుపేట : మండలంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని డీఎల్పీవో వెంకటేశ్వ ర్లు అన్నారు. అమీనాబాద్ సబ్సెంటర్, తిమ్మరాయినిపహాడ్ గ్రామాల్లోని కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట ఎంపీవో గౌడ సురేశ్, సర్పంచ్లు సిద్దెన రమేశ్, కొండవీటి పావని, వైద్య సిబ్బంది, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : భయాన్ని వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేష్ అన్నారు. లక్నేపల్లి గ్రామంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్కు వ్యాక్సిన్ కంటెయినర్, ఆక్సీమీటర్, థర్మామీటర్, బీపీ ఆపరేటర్, 5లీటర్ల శానిటైజర్ క్యాన్, వైద్య సిబ్బందికి వ్యక్తి గత ఆరోగ్య భద్రత కిట్లు, ప్రజలకు మాస్కులు అందించారు. డాక్టర్ భూపేష్ చేతుల మీదుగా ఎఫ్ఎంఎం సంస్థ డైరెక్టర్ రెజీనా చిన్నప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వలంటీర్ బెజ్జెంకి ప్రభాకర్ల సమక్షంలో వైద్య సిబ్బందికి అందించారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంజీవరావు, ఏఎన్ఎంలు సుజాత, యాకలక్ష్మి, ఆశ కార్యకర్తలు కొడారి కవిత, కల్పన, రమాదేవి, వీ కవిత ఉన్నారు.
వర్ధన్నపేట : కరోనా వ్యాక్సిన్ను 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంలోని చెన్నారం ఆరోగ్య ఉపకేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ పునుగోటి భా స్కర్రావు, ఉపసర్పంచ్ రాజమౌళి పాల్గొన్నారు.