నల్లబెల్లి, సెప్టెంబర్ 28: గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్న పార్టీలను నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం శనిగరం గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ కార్యకర్తలు పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి నిరోధకులుగా మారిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కరోనా వైరస్ కంటే పెనుప్రమాదమని, ఇలాంటోళ్ల కల్లబొల్లి మాటలను ఏ ఒక్కరూ నమ్మొద్దని ప్రజలను ఎమ్మెల్యే కోరారు.
ఉద్యమ స్ఫూర్తితో సంక్షేమం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదన్నారు. గోదావరి జలాలతో జలాశయాలను నింపడం వల్ల నియోజకవర్గం సస్యశ్యామలం అవుతున్నదన్నారు. రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి గోదావరి జలాలు అందించడం వల్ల వేసవిలోనూ మత్తళ్లు దుంకుతున్నాయని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికార దాహంతో ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు అశోక్గౌడ్, చేరాలు, ఊటుకూరి చక్రపాణి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో పోలెపాక రాజు, నీలం సమతారాజు, కక్కెర్ల అభిరాం, ఓరుగంటి రాజు, బూర కృష్ణ, తోపాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు.