వరంగల్ : లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక నిఘా పెడుతామని డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయంలో అడ్వయిజరీ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే సంబంధిత రెడియాలాజిస్ట్, గైనకాలాజిస్ట్ బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు, వర్క్షాపులు తక్కువగా నిర్వహించామని అన్నారు. రాబోయే రోజుల్లో ఆడపిల్లలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో పలువురికి సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యాకూబ్పాషా, డాక్టర్ పద్మ, డాక్టర్ కళ్యాణి, లీగల్ అడ్వయిజర్ రేవతీ దేవి, జిల్లా మాస్ మీడియా అధికారి ఆశోక్రెడ్డి, సర్వోదయ సేవా సమితి ప్రతినిధి కవిరాజ్, సీహెచ్టీవో మాధవరెడ్డి పాల్గొన్నారు.