హన్మకొండ సిటీ, జూన్ 8 : త్వరలో యాచకులు, వారి కుటుంబాలకు కరో నా వ్యాక్సిన్ వేయిస్తామని పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. హన్మకొండ పోలీసుల ఆధ్వర్యంలో పద్మాక్షీ కాలనీలోని యాచకులకు మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా సీపీ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో తిరిగే యాచకులకు అవగాహన లేనందున పోలీసుల ఆధ్వర్యంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వ రలో వైద్యశాఖ సహకారంతో వ్యాక్సిన్లు వేయిస్తామన్నారు. సుమారు 150 మంది యాచకులకు కరోనా పరీక్షలు నిర్వహించి, మాస్కులు అందజేసినట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో ఈస్ట్జోన్ డీసీపీ కొల్లి వెంకటలక్ష్మి, హన్మకొండ ఏసీపీ మూల జితేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై బొజ్జ రవీందర్, జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు, న్యూశాయంపేట వైద్యాధికారి మౌనిక, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
40వ డివిజన్లో కరోనా పరీక్షలు
కరీమాబాద్ : ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పాటు జ్వర సర్వేతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. డివిజన్ పరిధిలోని ఉర్సు లో యూహెచ్సీలో కరోనా పరీక్షల సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ కరోనా పరీక్షల సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దయానంద్కాలనీలో..
వరంగల్ చౌరస్తా : 27వ డివిజన్ పరిధిలోని దయానంద్కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కరోనా పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. చింతల్ యూహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొని కాలనీవాసులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మీసాల ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశ్, దేవి, రాజారాం, ఇందిరా, సులేమాన్ పాల్గొన్నారు.
ఎల్బీనగర్లో..
పోచమ్మమైదాన్ : గ్రేటర్ 13వ డివిజన్లోని మౌలాలి ప్రభుత్వ పాఠశాలలో దేశాయిపేట యూహెచ్సీ ఆధ్వర్యంలో 50 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి తెలిపారు.