ఐనవోలు, ఏప్రిల్ 28 : మండలంలోని ముల్కలగూడెం గ్రామంలో దర్గా కాజీపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులను ఆదుకుంటున్నాయని తెలిపారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. సర్పంచ్లు కట్కూరి రాజమణి, సునీత, మండల కోఆప్షన్ గుంషావళి, ఉప సర్పంచ్ సంపత్రావు, గ్రామ రైతు బంధు సమితి కన్వీనర్ సమ్మిరెడ్డి, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.