300 బెడ్లతో గిరిజనులకు సకల సౌకర్యాలు
50 పడకల ఆస్పత్రిగాతొర్రూరు సీహెచ్సీ ఉన్నతీకరణ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు సీహెచ్సీకి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత
తొర్రూరు, మే 20: రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, వరంగల్ ఎంజీఎం తరహా లో మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా రు. గురువారం ఆయన తొర్రూరులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో స్త్రీనిధి ద్వారా కొనుగోలు చేసిన పది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్ సమక్షంలో దవాఖాన వైద్యులకు అందజేశారు. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా కరోనా బాధితులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు మహబూబాబాద్లో 300 పడకలతో వైద్యకళాశాల నిర్మించనున్నట్లు తెలిపారు. తొర్రూరు సీహెచ్సీలో ప్రస్తుతమున్న 30 పడకలను 50కి పెంచనున్నట్లు ప్రకటించా రు.
ఆటా నుంచి ఇచ్చే మరికొన్ని కాన్సంట్రేటర్లను తొర్రూరుకు కేటాయించనున్నట్లు తెలిపారు. తొర్రూరు సీహెచ్సీకి ప్రముఖ వైద్యుడు చెర్లపాలానికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్రెడ్డి, ఝాన్సీ దంపతులు రూ.8లక్షల విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలు ఇవ్వడానికి ముందకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కొవిడ్ నోడల్ అధికారి రాజేశ్, ఆర్డీవో రమేశ్బాబు, డిప్యూటీ డీఎంహెచ్వో మురళీధర్, డీఎస్పీ వెంకటరమ ణ, స్త్రీనిధి ఆర్ఎం రవీంద్రనాయక్, ఎంపీపీ చిన్నఅంజ య్య, జడ్పీటీసీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్ర య్య, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, కమిషనర్ బాబు, వైద్యు లు దిలీప్, వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షుడు సీతారాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.