నల్లబెల్లి, మే 19 : కరోనా కాలంలోనూ పేదలను తెలంగాణ సర్కారు ఆదుకుంటున్నదని జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, నల్లబెల్లి జడ్పీటీసీ పెద్ది స్వప్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె అందించారు. స్వప్న మాట్లాడుతూ కరోనాతో సర్కారుకు ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఆర్ధికంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ను అందించి వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊడ్గుల సునీత, ఎంపీడీవో విజయ్కుమార్, సర్పంచ్లు రాజారాం, తిప్పని సృజన, గుగులోత్ రవళి, నాయకులు ఊడ్గుల ప్రవీణ్గౌడ్, గుగులోత్ రాము, తిప్పని లింగమూర్తి, వర్ణం నర్సింహారెడ్డి, గోనెల నరహరి, గుగులోత్ సమ్మయ్య, పోలుదాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.