వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
మడికొండ, ఏప్రిల్ 19 : కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. ధర్మసాగర్ కో ఆపరేటివ్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 64వ డివిజన్ పరిధిలోని టేకులగూడెం గ్రామానికి చెందిన బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఆరుముల్ల రాజు, టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మాతంగి పౌలు, మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే రమేశ్ తన నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విప్లవోద్యమాలకు కేంద్రంగా పేరుపొందిన టేకులగూడెం గ్రామాన్ని గత పాలకులు విస్మరించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక గ్రామంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ 64వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆవాల రాధికారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పోలపల్లి రామ్మూర్తి, మాచర్ల కుమారస్వామి, పోలెపాక వెంకటేశ్, మాచర్ల కరుణాకర్, కృష్టాఫర్, మాతంగి ప్రశాంత్, పోలెపాక దినేశ్, కొట్టె అనిల్, మాతంగి సురేందర్, కందిక మనోహర్, పోలెపాక రవి, ఆరుముళ్ల షడ్రక్, ఆరుముళ్ల స్వప్న, రాణి, విమల, సంతోషా, వినోదా, రజిత, సారమ్మ పాల్గొన్నారు.45వ డివిజన్ అయోధ్యపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరన్న 30 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, పోలెపల్లి శంకర్రెడ్డి, రాజు, మేరుగు రాజేందర్, శ్రీను, యాదగిరి, యేసోబు, శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
క్లాక్ టవర్ నిర్మాణ పనులను సుందరంగా తీర్చిదిద్దాలి
గ్రేటర్ వరంగల్లో ఇతర పార్టీల పని అయిపోయింది : మంత్రి సత్యవతి రాథోడ్