వరంగల్, మే 18 : పారిశుధ్య కార్మికులు విధి నిర్వహణలో మాస్కులు, గ్లౌజ్లు తప్పనిసరిగా వినియోగించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం ఆమె కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజ్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పని చేస్తూ నగరాన్ని రోజూ పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. క్షేత్రస్థాయి విధి నిర్వహణలో చాలా మంది జాగ్రత్తలు పాటించడం లేదని, తప్పనిసరిగా గ్లౌజ్లు, మాస్కులు ధరించాలని సూచించారు. కాగా, కార్పొరేషన్ హాల్ పక్కన ఉన్న ఫ్రిడ్జిని మేయర్ పరిశీలించారు. అది పని చేయడం లేదని సిబ్బంది తెలుపడంతో వెంటనే కొత్త ఫ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన ఆమె కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయం పైకప్పు పెచ్చులూడడాన్ని గమనించిన మేయర్ వెంటనే మరమ్మతు చేయించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ సత్యనారాయణ, కార్యదర్శి విజయలక్ష్మి, ఈఈ లక్ష్మారెడ్డి, డీఈ రవీందర్, బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్రాజ్ పాల్గొన్నారు.