సీటీ స్కాన్కు రూ.2వేలే తీసుకోవాలి
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండలోని డయాగ్నొస్టిక్ సెంటర్లలో తనిఖీ
రూ.5,700 వసూలు చేసిన విజయ డయాగ్నొస్టిక్ సెంటర్పై కేసు
బాధితులకు డబ్బులు వాపస్ ఇప్పించిన చీఫ్విప్
హన్మకొండ చౌరస్తా, మే 18 : ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన హన్మకొండ చౌరస్తాలోని పలు డయాగ్నొస్టిక్ సెంటర్లను టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు డీఎంహెచ్వో డాక్టర్ లలితాయాదవ్, ఏసీపీ జితేందర్రెడ్డి, సభ్యులతో కలిసి తనిఖీ చేశా రు. హన్మకొండ చౌరస్తా సమీపంలోని విజయ, ఎస్సార్, స్టార్, రాడార్, సూర్య డయాగ్నొస్టిక్ సెం టర్లను సందర్శించారు. విజయ డయాగ్నొస్టిక్ సెం టర్లో అధిక ధరకు సీటీ స్కాన్ చేస్తున్నారని అం దిన సమాచారం మేరకు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. సీటీ స్కాన్కు రూ.5,700 వసూలు చేస్తున్నట్లు అక్కడున్నవారు చెప్పడంతో యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి, బాధితులకు డబ్బులు వాపస్ ఇప్పించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చీఫ్విప్ మాట్లాడు తూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో సీఎం కేసీఆర్ ఇంటింటి సర్వే చేపట్టడడంతోపాటు లాక్డౌన్ విధించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ప్రతి జిల్లాకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి మందులు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. సీటీ స్కాన్కు రూ.2 వేలు, ఫిల్మ్ కావాలంటే రూ.2,500 తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి, పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అయినా కొందరు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. కొవిడ్తో బాధపడుతున్న వారికి భరోసా కల్పించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వైద్యసేవలు అందించాలని డయాగ్నొస్టిక్స్, ప్రైవేటు ఆస్పత్రుల యజమాన్యాలను కోరారు.