పరకాల, జూన్ 14: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఈటల రాజేందర్ ఢిల్లీలో తాకట్టు పెట్టాడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమలాపురం మండలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఆర్ఎంపీ వైద్యుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రాష్ట్రంలో వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపురం మండలంలో జరిగిన అభివృద్ధి సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే చేపట్టారన్నారు. టీఆర్ఎస్తో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ వ్యక్తిగత లాభం పొందే విధంగా వ్యవహరించారని విమర్శించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు వెచ్చించి కమలాపురం మండలంలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయిస్తానని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పని చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్కే మా మద్దతు..
ఆర్ఎంపీ వైద్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, నాయకులు నేతాని శ్రీనివాస్రెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి రమేశ్, దావు రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
పరకాల/ సంగెం: నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర, సంగెం, గీసుగొండ, ఖిలావరంగల్ మండలాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.31లక్షల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, రైతుబంధు సమితి మండ ల కోఆర్డినేటర్ కందకట్ల నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, వరంగల్ మార్కెట్ డైరెక్టర్ దోపతి సమ్మయ్యయాదవ్, సర్పంచ్ మామిడాల సుదర్శన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మండల కోప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, సంగెం పీఏసీఎస్ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, వైస్చైర్మన్ కూస రాజు, కడ్దూరి వీరభద్రయ్య పాల్గొన్నారు.
సీతారామచంద్రస్వామికి పూజలు
శాయంపేట: మండలంలోని ప్రగతిసింగారంలో సీతారామచంద్రస్వామిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆలయంలో దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటి స్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.