హన్మకొండ, మే 14: అర్బన్ జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇప్పటి వరకు 80శాతం మేర ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, సివిల్ సప్లయ్, డీఆర్డీవో అధికారులతో ధాన్యం కొనుగోలుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 105 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 52,986 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఎంపిక చేసిన 20 రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ చేసేందుకు ప్రత్యేక వాహానాల ద్వారా ధాన్యాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా హమాలీల కొరతతో కొంత ఆలస్యమైనా నెలాఖరులోగా పూర్తి చేసి నిర్ధేశించిన మేరకు రా, బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐకి లెవీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గోనె సంచులు, ఇతరత్రా సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, డీఎస్వో వసంతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ ఉషాదయాల్, సహకారశాఖ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.