నర్సంపేట రూరల్, ఏప్రిల్ 12 : 45 సంవత్సరాలు దాటిన వారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ అన్నారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యాధికారి చేపట్టారు. ఈ సందర్భంగా పలువురికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకాపై అపోహలు వద్దు
నల్లబెల్లి, ఏప్రిల్ 12 : కరోనా టీకాపై అపోహలు వద్దని వైద్యాధికారి మహేందర్నాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సోమవారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కన్నారావుపేట సర్పంచ్ తంగెళ్ల నిర్మల టీకా వేయించుకున్నారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ రోజురోజుకూ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు.
అవగాహన కల్పించాలి
నల్లబెల్లి, ఏప్రిల్ 12 : కరోనా వ్యాక్సిన్పై మండలప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ఎంపీపీ ఊడుగుల సునీత అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ‘కరోనా టీకాతో ఉపయోగాలు’ అనే అంశంపై ఆమె సమీక్షించారు. కొవిడ్ లేని మండలంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీవో కూచన ప్రకాశ్, వైద్యాధికారులు శశికుమార్, మహేందర్నాయక్ పాల్గొన్నారు.
60 మందికి కరోనా వ్యాక్సిన్
శాయంపేట, ఏప్రిల్ 12 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం 60 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు హెల్త్ అసిస్టెంట్ చలపతి తెలిపారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు 11 మంది జీపీ సిబ్బందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. అదేవిధంగా 14 మందికి రాపిడ్ యాంటీజన్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వివరించారు.
గ్రామాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
దుగ్గొండి, ఏప్రిల్ 12 : కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. తిమ్మంపేటలో సర్పంచ్ మోడెం విద్యాసాగర్గౌడ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా నుంచి కోలుకున్న అక్షయ్.. హాస్పిటల్ నుంచి ఇంటికి