తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్
వరంగల్ చౌరస్తా, జూన్ 9: కరోనా నుంచి కోలుకున్న వారిని వేధిస్తున్న బ్లాక్ ఫంగస్పై మరిన్ని పరిశోధనలు జరుపాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సూచించారు. బుధవారం కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ బీ కరుణాకర్రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఆన్లైన్ తరగతుల నిర్వహణ, పరిశోధన అంశాలు, కరోనా వ్యాక్సినేషన్, ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్ వలంటరీ సేవలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నష్టం కలుగకుండా పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ, పరిశోధనలు, అల్యూమినీ కనెక్ట్, కరోనాపై చేస్తున్న పోరాటంలో వైద్య విద్యార్థులు అందిస్తున్న సేవలపై తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై సూ చనలు చేశారు. కరోనా కాలంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు అందిం చిన సేవలు, వైరస్పై చేస్తున్న పరిశోధనలను తెలంగాణ గవర్నర్ అభినందిం చారు. వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్ట పోకుండా ఉండడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మెడికల్, డెంటల్, నర్సింగ్, సీసీహెచ్, సీసీఐఎం నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నామ ని అన్నారు. గాంధీ దవాఖానలో బాధితులకు అందుతున్న కొవిడ్ సేవల లను గవర్నర్కు వివరించారు.