కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం
ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి
పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సంగెం, మే 8: రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండ్రాయిలో శనివారం వారు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, నాయకులు నరహరి, ఈ అశోక్, కే మొగిలి, కడ్డూరి సంపత్, అనుముల ప్రతాప్, కే సంపత్, కుమారస్వామి, పురుషోత్తం, ప్రవీణ్, అనుముల చంద్రమౌళి, నిర్వాహకుడు కే నరేశ్, రైతులు పాల్గొన్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి
నెక్కొండ: మండలంలోని లావుడ్యానాయక్తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మారం రాము, జడ్పీటీసీ లావుడ్యా సరోజన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ లావుడ్యా హరికిషన్, మండల నాయకులు దొనికెన సారంగపాణి, సౌరపు శ్రీనుయాకు, ఈదునూరి యాకయ్య, కో ఆప్షన్ సభ్యుడు అమ్జద్ఖాన్, సీఈవో మోడెం సురేశ్ పాల్గొన్నారు.
రైతులు వినియోగించుకోవాలి
ఆత్మకూరు: రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి అన్నారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కేవలం తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తూ రైతు సేవలో తరిస్తున్నారన్నారు. అన్నదాతలు మాస్కు లు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రూ. 1888, బీ గ్రేడ్ ధాన్యానికి రూ. 1688 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గూడెప్పాడ్ మార్కెట్ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లుగౌడ్, ఎంపీటీసీ రమారాజు, మండల కోఆప్షన్ మెంబర్ అంకుస్, డైరెక్టర్లు భిక్షపతి, ఎండీ రహీమొద్దీన్, ఆరె వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎస్ రాజేశ్వర్రావు, బీ రాజు, కోర్నెల్, మార్కెట్ సిబ్బంది ప్రవీణ్, శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.