పరారీలో మరో ఎనిమిది మంది
రూ.76 వేలు, 12 సెల్ఫోన్లు స్వాధీనం
వివరాలను వెల్లడించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్, మే 7 : మహబూబాబాద్ బెస్తబజార్లో మట్కా ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.76 వేలు, 12 సెల్ఫోన్లు, బెట్టింగ్కు ఉపయోగించే బుక్, స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం టౌన్ పోలీస్స్టేషన్లో ఏఎస్పీ యోగేశ్ గౌతమ్తో కలిసి విలేకరులకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లో మట్కా ఆటను నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక టాస్క్ఫోర్స్, మహబూబాబాద్ సీఐ వెంకటరత్నం నేతృత్వంలో ఓ బృందంతో నిఘా వేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో బెస్త బజార్కు చెందిన పిల్లి సంధ్య(నిర్వాహకురాలు), హరిజనవాడకు చెందిన పుచ్చకాయల దేవేందర్, హనుమంతునిగడ్డకు చెందిన పుచ్చకాయల సోమయ్య, పొన్నం సంపత్, కాంపల్లి రాజు, జిట్టబోయిన వెంకటేశ్వర్లు, పుచ్చకాయల శ్యాంప్రసాద్, పారనంది వెంకన్న, చిన్నోజు నాగేంద్రాచారి, రామచంద్రాపురం కాలనీకి చెందిన దాసరి కృష్ణ, అంబేద్కర్ నగర్కు చెందిన మహ్మద్ సత్తార్, కృష్ణ కాలనీకి చెందిన కొత్తపల్లి రామకృష్ణ, డోర్నకల్ సుభాష్నగర్కు చెందిన పోకల్ శంకర్, కామెపల్లి బర్లగూడేనికి చెందిన బానోత్ శంకర్ ఉన్నారు. కాగా, పిల్లి కుమారస్వామి(నిర్వాహకుడు), ఇరుకుల్ల దేవేందర్, దేశబోయిన నాగేశ్వర్రావు, మాలోత్ రమేశ్, భూక్యా వెంకన్న, జీ సుధాకర్, చిదిరాల జనార్దన్, కిరణ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్రావు, టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం, టాస్క్ఫోర్స్ ఎస్సై రామారావు, ఎస్సై అరుణ్కుమార్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.