రూ.4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు
ఫలించిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కృషి
హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు
నేడు పనులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే
నర్సంపేట, జూన్ 6: నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇప్పటికే మోడల్ సిటీలో భాగంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కృషితో రూ.4.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్ మంజూరైంది. టెండర్లు సైతం ఖరారయ్యాయి. ఈ పనులను ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని సౌకర్యాలతో ఈ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో అంతస్తుకు 18వేల ఫీట్ల చొప్పున గ్రౌండ్ఫ్లోర్ రెండు జీప్లస్ టూ అంతస్తులతో కలిపి మొత్తం 54 వేల ఫీట్లతో అంగడి సెంటర్ గ్రౌండ్లో ఈ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 46 నాన్వెజ్ స్టాల్స్, (మటన్, చికెన్, ఫిష్), 72 వెజ్స్టాల్స్, 18 ఫ్రూట్ స్టాల్స్, 10 ఫ్లవర్స్టాల్స్, 5 ఫిష్ కటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మార్కెట్కు వచ్చే వినియోగదారులు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎనిమిది వేల ఫీట్ల ఏరియా గ్రౌండ్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. రైతులు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించే విధంగా రూ.50లక్షలతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకులు ఒకేచోట లభించే విధంగా నియోజకవర్గంలో ఇంతపెద్ద మార్కెట్ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు విక్రయించేందుకు ఈ మార్కెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, నియోకవర్గ ప్రజలు, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గానికి మార్కెట్ మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.