పరకాల, ఏప్రిల్ 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారాయని, పట్టణాలకు వలసవెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వచ్చారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాగారం గ్రామం లో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుని, రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. గ్రామా లు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ఆలోచనతో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, ప్రతి ఎకరాకూ సాగు అందిస్తున్నారన్నారు. పెట్టుబడి సాయం కూడా చేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. గ్రామాల నుంచి వలస వెళ్లిన రైతులు తిరిగొచ్చి, వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. అంతే కాకుండా తక్కువ పెట్టుబడితో ఆధునిక పద్ధతిలో పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.
ఇందులో భాగంగానే ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా వ్యవసాయ అధికారిని నియమించారన్నారు. రైతుల కోసమే రైతు వేదిక భవనాలను నిర్మించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రైతుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఈ వేదిక ద్వారా అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేడీఏ ఉషాదయాళ్, ఏడీఏ రవీందర్, సర్పంచ్ కట్కూరి స్రవంతి, ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ సిలివేరు మొగిలి, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, జిల్లా సభ్యులు చింతిరెడ్డి సాంబారెడ్డి, గురిజపల్లి ప్రకాశ్రావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేశ్, పరకాల, మాదారం పీఏసీఎస్ చైర్మన్లు నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ ఏరుకొండ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ పాల్గొన్నారు. కాగా, పరకాలలోని లలితా నర్సింగ్ హోంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నారు. రెండో దశ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, 45 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా వ్యాక్సిన్ను తీసుకోవాలని ఆయన సూచించారు.
నడికూడ మండలంలో..
నడికూడ : మండలంలోని రాయపర్తి, కంఠాత్మకూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటలు వివరాలు రైతు వేదికలో నమోదు చేసుకోవాలన్నారు. అధికారులు, నాయకులు, శాస్త్రవేత్తలతో చర్చించుకోవడానికి ఈ వేదికలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుల సరితారాజిరెడ్డి, జడ్పీటీసీ కోడెపాక సుమలత కరుణాకర్, ఎంపీపీ మచ్చ అనసూర్య, కంఠాత్మకూర్ సర్పంచ్ ఆర్ సతీశ్, వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
బొలెరో వాహనం దగ్ధం..తప్పిన ముప్పు
శానిటేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం