వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పటిష్టం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులతో పాటు పైపున్లైన్ లీకేజీలను పరిశీలించారు. పోతన నగర్లోని మినీ డంపింగ్ యార్డును పరిశీలించి ఆమె ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకపడ్డారు. డంపింగ్యార్డులో ర్యాంపు నిర్మాణం చేయాలని గతంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే ర్యాంపు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అక్కడి నుంచి నగరంలోని ప్రధాన రహదారులతో పాటు రైల్వేస్టేషన్ జంక్షన్, హెడ్పొస్టాఫీస్ జంక్షన్లను పరిశీలించారు. రోడ్లపై డంపర్బిన్లలోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు.
డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. హెడ్ పొస్టాఫీస్, రైల్వేస్టేషన్ జంక్షన్ల విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శివనగర్ నిర్మాణంలో ఉన్న డట్ పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. డట్ నిర్మాణంలో పై నుంచి వస్తున్న మురుగు నీరుతో నిర్మాణంలో ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ పై నుంచి వస్తున్న మురుగునీటీని పైపులైన్ వేసి మళ్లించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో మురుగు నీటి మళ్లీంపు పనులు జరుగాలని ఆమె అన్నారు. అనంతరం వాల్మార్ట్ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీని మేయర్, కమిషనర్ పరిశీలించారు.
నిరంతరం పైపులైన్ లీకేజీతో సమస్యలు వస్తున్న నేపథ్యంలో మేయర్ సుధారాణి ఈఎన్సీతో ఫోన్లో సమస్యను వివరించారు. వెంటనే లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో బల్దియా చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఏఈ సతీష్, శానిటరి సూపన్వైజర్ సాంబయ్య, శానిటరి ఇన్స్పెక్టర్ శ్యామ్రాజ్ పాల్గొన్నారు.