వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్లో వందశాతం వ్యాక్సినేషన్ జరుగాలని కమిషనర్ ప్రావీణ్య అన్నారు. శనివారం కార్పొరేషన్ కౌన్సిల్ హల్లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సిబ్బంది సర్వే చేసి అర్హులందరికీ వ్యాక్సిన్ను వేయాలన్నారు. పది రోజుల పాటు నిర్వహించే స్పెషల్ డ్రైవ్లో వందశాతం టీకా చేసేలా అధికారులు చర్య తీసుకోవాలన్నారు. ప్రతి రోజు డివిజన్లో 200 మందికి టీకా వేయాలని ఆమె టార్గెట్ విధించారు. ఇంటింటికీ సర్వే చేసి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి మరుసటి రోజు వ్యాక్సిన్ వేయాలని ఆమె సూచించారు. ఇంటింటి సర్వేను పక్కగా చేయాలని సూచించారు. బల్దియా, వైద్యశాఖ సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
డీఎంహెచ్వోలతో ప్రత్యేక సమావేశం
హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవీ, వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణలతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వందశాతం వ్యాక్సినేషన్పై ఆమె వారితో చర్చించారు. వ్యాక్సిన్ కోరత లేకుండా బల్దియా సిబ్బందికి సహకరించాలని అన్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్ తనీఖీ
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో కమిషనర్ ప్రావీణ్య హన్మకొండలోని దుర్గా కాలనీలోని ఇంటింటి సర్వే, వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆమె తనీఖీ చేశారు. సిబ్బంది పనితీరును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.