వరంగల్ : వరంగల్ నగరంలోని సెంట్రల్ జైల్ పెట్రోల్ పంపులో మెగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభమైంది. గతంలో డిజిల్ కాలనీలో తొలి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించగా శుక్రవారం రెండో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ను సెంట్రల్ జైల్లో ఇండియన్ అయిల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజన్ ధర్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితానికి సీఎన్జీ ఎంతో దోహద పడుతుందన్నారు. వాహన కాలుష్యం పెరిగి అనేక వ్యాధులతో ప్రజలు బాధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సీఎన్జీ వైపు మళ్లాలని అన్నారు. భవిష్యత్లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వైపు వాహనదారులు మొగ్గుచూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెగా గ్యాస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి హరీష్నాయుడు మాట్లాడుతూ త్వరలోనే మరో రెండు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించను న్నామని తెలిపారు. వ
రంగల్, రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ విక్రయాలు ప్రారంభించిన తాము త్వరలోనే ఖమ్మం, నల్గొండ జిల్లాలలో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో మెగా సంస్థ 12 గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించిందన్నారు. వ్యాపార, పరిశ్రమలకు గ్యాస్ అందుబాటులోకి తీసుకవస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్, జైలర్ శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ దేవేందర్, బజాజ్ ఆటో సెల్స్ మేనేజర్ కిశోర్కుమార్, పీజీయో జనరల్ మేనేజర్ సంతోశ్రెడ్డి, ఐవోసీ రీజినల్ సెల్స్ మేనేజర్ బుచ్చయ్య, అసిస్టెంట్ మేనేజర్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.