కాశీబుగ్గ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్థన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 3వ డివిజన్లోని వజ్ర గార్డెన్స్లో 3, 14వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ కమిటీల ఏర్పాటుపై దిశా నిర్ధేశం చేసినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపెతానికి కృషి చేయాలని కోరారు. సీయం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ లలితాయాదవ్, స్థానిక కార్పొరేటర్ జన్నుశోభారాణి అనిల్, 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటీ సులోచన, ఇండ్ల నాగేశ్వర్రావు, హన్మకొండ పీఎసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, నాయకులు కుమార్యాదవ్, బుద్ద వెంకన్న, బోరిక రమేశ్, ముడుసు నర్సింహ, రాజశేఖర్, గంధం గోవిందు, పత్రి సుభాశ్, రాజపోషాలు, పసులాది మల్లయ్య, మచ్చర్ల స్టాలిన్, కట్ల నాగరాజు, రాజు పాల్గొన్నారు.