ఖిలావరంగల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేటి నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు జరుగుతున్నాయని రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా, ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చింది. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి పలు రైళ్లల్లో వేగం పెంచారు. మారిన టైం టేబుల్, రైళ్ల నెంబర్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. మార్పులు చేర్పుల రైల్వే సమాచారం కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో పొందుపరిచారు.
వరంగల్ మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు
రైలు నెం. 02745/02746 సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లవలిసిన ఎక్స్ప్రెస్ను సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు రైల్వే శాఖ ప్రకటనలో పేర్కొంది. అలాగే రైలు నెం. 07260/07259 భద్రాచలం రోడ్డు నుంచి సిర్ఫూర్ టౌన్ రైల్వేస్టేషన్ వరకు వెళ్లవలిసిన ప్యాసింజర్ను ఎక్స్ప్రెస్గా మార్చారు. అలాగే రైలు నెం. 02513/02514 సికింద్రాబాద్ నుంచి గోహతి వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు, రైలు నెం. 02203/02204 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వీక్లీ ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్ విజయవాడ మీదుగా కాకుండా సికింద్రాబాద్, పడిగిపల్లి, విజయవాడ, దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది. అలాగే బల్లార్షా నుంచి భద్రాచలం మధ్య నడిచే 07271/07272 రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.